twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా లవ్ స్టోరీ సినిమాగా... శ్రీజ, శిరీష్ భరద్వాజ్

    By Srikanya
    |

    చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ డైరక్టర్స్ మా ప్రేమ కథను సినిమా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే మేము ఒప్పుకోలేదు అంటోంది చిరంజీవి కుమార్తె శ్రీజ. అప్పటి సంఘటనలు ఇప్పుడు తల్చుకుంటూంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ తీరాయి.మా కుటుంబంతో మా సంభంధ భాందవ్యాలు మెరుగయ్యాయి అంటోంది ఆమె. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ అప్పట్లో శిరీష భరద్వాజ్ అనే కుర్రాడుతో వెళ్ళి అక్టోబర్ 17,2007న ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆమె డిల్లీ వెళ్ళి అక్కడ కోర్టును తన కుటుంబం నుంచి రక్షణ కల్గించమని అడిగింది.

    ఆ సంఘటన జరిగిన దాదాపు రెండేళ్ళ అనంతరం తమ సంవత్సరంన్నర పాప నివృతిని తీసుకుని శ్రీజ,శిరీష్ దంపతులు డిల్లీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ లోకల్ గా పాపులర్ అయిన ఓ న్యూస్ పేపర్ కు ఆమె ఇంటర్వూ ఇచ్చారు. అందులో బాగంగా పై విధంగా అప్పటి సంగటనలు తల్చుకుని నిట్టూర్చారు.

    అనంతరం ఆమె మాట్లాడుతూ..నివృతి పుట్టిన తర్వాత మాత్రమే మా అమ్మ,సోదరుడు రామ్ చరణ్ తేజ మమ్మల్ని హాస్పటిల్ లో చూడటానికి వచ్చారు. జూలై ఐదున ఇది జరిగింది. అంతకు ముందు కేవలం నాతో ఫోన్ లో మాత్రమే టచ్ లో ఉండేవారు. ఇక ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పడు తలుచుకుంటే నిజంగా జరిగాయా అనిపిస్తూంటుంది..ఎందుకంటే ఆంద్రాలో దేముడు గా భావించే చిరంజీవి ని ఎదిరించటం అంటే మాటలు కాదు కదా అంటోంది. అయితే అలా ధైర్యం చేయటానికి కారణం మా ప్రేమ, మా ఇన్నర్ స్ట్రెంత్ మాత్రమేనని చెప్తోంది. అలాగే అప్పట్లో చాలా మంది ఓ రాజకీయనాయుకుడు మా వెనక ఉన్నాడన్నారు. కానీ అదంతా తప్పు అని నిరూపించాం అని వివరిస్తోంది.

    ఇక హైదరాబాద్ లో ఈ సంఘటన జరిగి కాపురం పెట్టాక మార్కెటింగ్ ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు చాలా మంది తెలిసున్న వాళ్లు పలకరించేవారు. రకరకాల కామెంట్స్ వచ్చేవి. కొందరు మా నాన్నగారిని ఎదిరించే ధైర్యం చేసామంటూ మెచ్చుకునేవారు కూడా అంటూ చెప్పుకొచ్చిందామె. అలాగే చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ డైరక్టర్స్ మా ప్రేమ కథను సినిమా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే మేము ఒప్పుకోలేదు. నివృతి పుట్టి మా కుటుంబం మళ్ళీ దగ్గరయ్యాక ఇటువంటి సమస్యలు తగ్గాయి. ఇదే విషయమై శిరీష్ మాట్లాడుతూ..నివృతి అటు కుటుంబంలో మొదటి మనమరాలు. దాంతో చుట్టాలు రావటం ప్రారంభించారు. సంభందాలు మెరుగయ్యాయి. అంతా నార్మల్ అయింది. శ్రీజకి తన అత్తమామలు కూడా బాగా సపోర్టివ్ గా ఉన్నారంటూ చెప్తోంది.

    చివరగా ఈ జంటను మీరు రాజకీయాల్లో చేరుతారా అంటే శ్రీజ మాట్లాడుతూ..నాకు ఎప్పుడూ రాజకీయాలు అంటే ఆసక్తి లేదు..మా నాన్నగారిని కూడా రాజకీయాల్లో చేరవద్దని సలహా ఇచ్చాను..అంటోంది. శిరీష్ ఇదే విషయంపై స్పందిస్తూ...ఏమో ప్రస్తుతానికైతే ఎటువంటి ఆలోచనా లేదు..భవిష్యత్ ని గురించి చెప్పలేను అని తేల్చేసాడు. ప్రస్తుతం శిరీష్ సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. శ్రీజ తన ఛార్డెడ్ ఎకౌంటన్సీ కోర్సును పూర్తి చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X