Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అశ్వనీదత్ బ్యానర్ లో నెక్ట్స్ చిత్రం చేస్తున్నా: శ్రీకాంత్ అడ్డాల
తుని: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన శ్రీకాంత్ అడ్డాల తదుపరి చేయబోయే చిత్రంపైనే అందరి దృష్టి. తాజాగా ఆయన తను నెక్ట్స్ చేయబోయే చిత్రం వివరాలను మీడియాకు తెలియచేసారు. ఆయన మాటల్లోనే..చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్తేజ్తో కొత్త చిత్రం రూపొందిస్తాను. యువతను ఆకట్టుకునే సినిమా ఇది. వైజయంతీ మూవీస్లో అశ్వనీదత్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించనున్నాం. ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు సంబంధించి కథలు చర్చిస్తున్నా. త్వరలో దీనికి సంబంధించి వివరాలు వెల్లడిస్తా అని తెలియచేసారు.
తన కుటుంబం గురించి చెపుతూ... మాది ప.గో.జిల్లా తణుకు దగ్గరలోని రేలంగి. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, చెల్లి, నాన్నమ్మ ఇది మా కుటుంబం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కుటుంబంలానే మాది కూడా. విద్యార్థిగా ఉన్నప్పుడు చదువులో ఎప్పుడూ నెంబర్ వన్గా ఉన్నాను. ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎస్సీ చేశాను. ఆతర్వాత ఎంటెక్ పూర్తి చేశాను. ఢిల్లీ ఐ.ఐ.టి.లో సీటు పొందిన తర్వాత సినిమాలపై కోరిక మరింత పెరిగింది అన్నారు.
ఇక చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటం వల్లే ఈ రంగంలోకి వచ్చానని, ప్రేక్షకులు మెచ్చే దర్శకుడుగా పేరు తెచ్చుకోవాలన్నదే తన కోరికని సినీ దర్శకులు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఆయన మాటల్లోనే... చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. మనసులో సినిమాలకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉండేది. ఐ.ఐ.టి. ప్రథమ సంవత్సరంలో ఉండగా సినిమాల్లోకి వెళ్లి నిలదొక్కుకోవాలనే ధైర్యాన్ని ఐ.ఐ.టి. ఇచ్చిందనే చెప్పాలి. అంతే చదువు మధ్యలో ఆపేసి సినిమారంగంలోకి అడుగుపెట్టాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ... దిల్రాజు నిర్మాతగా కొత్తబంగారులోకంలో అవకాశం దక్కించుకున్నాను అన్నారు.
అలాగే సినిమా రంగంలో ఒడిదుడుకులు అంతగా లేవనే చెప్పాలి. కొత్తబంగారు లోకం తీసిన నాలుగేళ్ల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైంది. మల్టీస్టారర్ సినిమా కావడం, సినిమా షూటింగు దాదాపు ఏడాది పాటు చేశాం. ఈ సినిమాకి వచ్చిన ఆదరణ మరువలేనిది. విదేశాల్లోనూ విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి.
కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువతకు... నేను చెప్పేదేమిటంటే.. ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే సామర్థ్యం ఉండాలి. కసితో నిరూపించుకోవాలి. ఉపాధి అవకాశాలుకు సంబంధించి ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇష్టమున్న రంగంలోనే పూర్తిస్థాయిలో రాణించగలుగుతారు అన్నారు. శ్రీప్రకాష్ పాయకరావుపేట విద్యానికేతన్లో జోష్ కార్యక్రమానికి గురువారం అతిథిగా వచ్చిన ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. మంచి విద్యార్థిగా ఉన్న తాను సినీ దర్శకునిగా ఎదిగిన వైనాన్ని వివరించారు.