twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దండుపాళ్యం’ దర్శకుడితో శ్రీకాంత్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోగా శ్రీకాంత్‌కు ఈ మధ్య హిట్లేమీ లేక పోయినా అడపా దడపా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాంత్ 'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాసరాజుతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. గతంలో శ్రీకాంత్ హీరోగా గోల్డెన్ లయన్ ఫిలిమ్స్ పతాకంపై 'మహాత్మ' చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్, 'ఇ స్క్వేర్ ' సంస్థ విజయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    తెలుగు, కన్నడ భాషలలో రూపొందనున్న ఈచిత్రం జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ చిత్రం 'దండుపాళ్యం' సినిమాలా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. చిత్ర కథ, కథనాలు కొత్తదనాన్ని కలిగి ఉంటాయని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. బ్యానర్: 'గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్, నిర్మాతలు : సి.ఆర్.మనోహర్, విజయ్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీనివాసరాజు.

    ప్రస్తుతం శ్రీకాంత్ 'షాడో' సినిమాలో సైడ్ హీరోగా చేస్తున్నాడు. ఈచిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మెయిన్ హీరో. 'అనుచరుడు' అనే మరో చిత్రంలో కూడా శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం విడుదలైన శ్రీకాంత్ సినిమాలు సేవకుడు, శ్రతువు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.

    English summary
    Srikanth with Dandupalyam director : Srikanth is going to act in Telugu and Kannada in the direction of Srinivasa Raju who has made Dandupalyam. Producer of Mahatma CR Manohar and Vijay are going to jointly produce this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X