Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సింహా చిత్రం స్థాయిలో అదరకొట్టాం...శ్రీకాంత్
సింహా స్థాయిలో చక్రి రీరికార్డింగ్ అదరగొట్టాడు. గౌతంరాజు ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. విమలా రామన్ చాలా గ్లామర్ గా, కొత్తగా కనిపిస్తుంది అని హీరో శ్రీకాంత్ తన తాజా చిత్రం రంగ ది దొంగ విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం నెల(డిసెంబర్) 30న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాలను మీడియాకు తెలియచేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ...ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ చిత్రాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పూర్తిస్థాయిలో మాస్ని ఆకట్టుకునే చిత్రం రంగ ది దొంగ. ఓ పెద్ద దర్శకుని తరహాలో జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహాత్మ తర్వాత నిర్మాత మనోహర్ మళ్లీ నాతోనే ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేసారు. సుధాకర్ నాయుడు(జీవీ) దర్శకత్వంలో గోల్డెన్ లయన్ ఫిలింస్, గాడ్ ఫాదర్ ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో సి.ఆర్.మనోహర్, సుధాకర్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.