Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అతడిని నిందించడం లేదు.. అనాథలా అందరి వద్ద.. గోవాలో శ్రీముఖికి చేదు అనుభవం
బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తెరపై ఎంత చలాకీగా ఉంటుందో సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా అల్లరి చేస్తుంటుంది. అలాంటి శ్రీముఖి గత వారం గోవాలో హల్చల్ చేసింది. తన గ్యాంగ్ను వేసుకుని గోవా ట్రిప్కు వెళ్లింది శ్రీముఖి. అందులో విష్ణుప్రియ, ఆర్జే చైతు, శుశుత్ర్, అరియానా, అవినాష్ ఇలా అందరూ రచ్చ రచ్చ చేశారు.
గ్యాంగ్తో హల్చల్..
శ్రీముఖి ప్రతీ వీకెండ్లో తన గ్యాంగ్తో కలిసి రచ్చ రచ్చ చేస్తుంటుంది. శ్రీముఖి, ఆర్జే చైతు, శుశ్రుత్ ఈ అందరూ కలిసి అప్పుడప్పుడు వెకేషన్స్కు వెళ్తుంటారు. అలా గతంలో ఓ సారి మాల్దీవులకు వెళ్లి వచ్చారు. బిగ్ బాస్ మూడో సీజన్ అనంతరం శ్రీముఖి తన గ్యాంగ్తో సహా మాల్దీవులకు చెక్కేసి రచ్చ చేసింది.
ఆ ఇద్దరూ కూడా..
అయితే ప్రస్తుతం శ్రీముఖి గ్యాంగ్ కాస్త పెద్దదైంది. శ్రీముఖి గ్యాంగ్లో అవినాష్ ఆ మధ్య కలిశాడు. ఏకంగా అవినాష్తో కలిసి శ్రీముఖి ఉమనియా అనే షోను కూడా చేసింది. అయితే ఈ మధ్యే ఈ గ్యాంగ్లో అరియానా కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ అందరూ కలిసి గోవాలో రచ్చ చేశారు.
గత వారంలో హల్చల్..
గత వారం ఈ గ్యాంగ్ అంతా కూడా గోవాలో సందడి చేసింది. అలా సముద్రంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో శ్రీముఖి ఫోన్ను ఆర్జే చైతూ నీళ్లలో పడేశాడట. అయితే దానికి అతడిని నిందించడం లేదు. ఏదో సరదాకి అలా చేశాడు.. అందుకే నా వద్ద ఇప్పుడు ఫోన్ లేదంటూ శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.
అనాథలా అందరి వద్ద..
తాజాగా శ్రీముఖి లైవ్లోకి వచ్చి ఈ కథంతా చెప్పింది. అది కూడా తన ఫోన్ లేకపోవడంతో విష్ణుప్రియ ఫోన్లోంచే లైవ్లోకి వచ్చినట్టుంది. గోవాలో తన ఫోన్ అలా పాడవ్వడంతో అనాథలా అందరిని ఒక్క సారి ఫోన్ ఇవ్వమని అడుక్కున్నానంటూ చెప్పుకొచ్చింది.
త్వరలోనే..
అయితే తన ఫోన్ను ఇప్పుడు రిపేర్కు ఇచ్చానని, అందులో నీళ్లు చేరిపోయాయని శ్రీముఖి తెలిపింది. ఆదివారం రాత్రి గోవా నుంచి హైద్రాబాద్కు రిటర్న్ అయ్యానని తెలిపింది. మొత్తానికి గోవాకు వెళ్లిన శ్రీముఖికి ఇలా ఫోన్ పోవడం మాత్రం చేదు అనుభవమే.