Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీనివాస్ రెడ్డి సినిమా విడుదలకు సిద్దం.. ఫీల్గుడ్ కథతో ప్రేక్షకుల ముందుకు!
శ్రీనివాస్ రెడ్డి కామిడి పాత్రలు చేస్తూనే హీరోగా మంచి కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శ్రీనివాస్ రెడ్డి మంచి ఫీల్గుడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. 1993లో విడుదలైన జంబలకిడి పంబ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఆ సమయంలో మంచి హిట్ సినిమాగా నిలిచినా ఈ సినిమాను మళ్లీ అదే పేరుతో జంబలకిడి పంబగా తెరకెక్కించారు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది.
నటుడు శ్రీనివాస్ రెడ్డి కామిడి పాత్రలు చేస్తూనే హీరోగా మంచి కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శ్రీనివాస్ రెడ్డి మంచి ఫీల్గుడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో విడుదలైన 'జంబలకిడి పంబ' సినిమాను మళ్లీ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
1993లో విడుదలైన జంబలకిడి పంబ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఆ సమయంలో మంచి హిట్ సినిమాగా నిలిచినా ఈ సినిమాను మళ్లీ అదే పేరుతో జంబలకిడి పంబగా తెరకెక్కించారు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. జంబలకిడి పంబ సినిమాను జూన్ 14న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, 'వెన్నెల' కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాకు సతీష్ ముత్యాల కెమెరామెన్ గా పని చెయ్యడం జరిగింది.