twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దూకుడు’కి డబల్ డోస్ ‘ఆగడు’ : శ్రీను వైట్ల

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన 'దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.

    దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రం 'ఆగుడు' అనే టైటిల్ తో రూపొందబోతోంది. శ్రీను వైట్ల తన తాజా సినిమా 'బాద్ షా' విడుదల నేపథ్యంలో సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బాద్ షా' తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' చిత్రం రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఎంటర్ టైన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం దూకుడుకి డబల్ డోస్ లా ఉంటుందని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ బాబు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత 'ఆగడు' సినిమా ప్లోర్ మీదకు రానుంది.

    14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు'సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    English summary
    Super Star Mahesh Babu-Srinu Vaitla upcomming movie title "Aagadu" under consideration. This film will be produced by Dookudu producers Anil Sunkara, Ram Achanta and Gopi Achanta on 14 Reels banner. Sreenu Vaitla is excited about the project and he says that the entertainment quotient in ‘Aagadu’ will be more than that of ‘Dookudu’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X