Don't Miss!
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Finance Cerlec News: మీరూ మీ పిల్లలకు సెరెలాక్ ఆహారంగా ఇస్తున్నారా.? షాకింగ్ వార్త తెలుసుకోండి..
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
‘దూకుడు’కి డబల్ డోస్ ‘ఆగడు’ : శ్రీను వైట్ల
దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రం 'ఆగుడు' అనే టైటిల్ తో రూపొందబోతోంది. శ్రీను వైట్ల తన తాజా సినిమా 'బాద్ షా' విడుదల నేపథ్యంలో సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బాద్ షా' తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' చిత్రం రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఎంటర్ టైన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం దూకుడుకి డబల్ డోస్ లా ఉంటుందని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ బాబు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత 'ఆగడు' సినిమా ప్లోర్ మీదకు రానుంది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు'సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.