Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వరుసగా మూడు కామెడీ సినిమాలు.. రూమర్స్ పై ఘాటుగా స్పందించిన శ్రీనువైట్ల..
ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ ఈవివి.సత్యనారాయణ శిష్యులలో శ్రీనువైట్ల ఒకరు. ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఎన్నిసార్లు చూసినా నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తాయి. అయితే వరుసగా డిజాస్టర్స్ రావడం వలన ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గుతోంది. ఆగడు నుంచి కాంటిన్యూగా అపజయాలను చూస్తున్నారు.
మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టడంతో చిన్న హీరోలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు వెనుకడుగు వేసినట్లు రూమర్స్ బాగానే వచ్చాయి. ఇక మొత్తానికి మళ్ళీ విష్ణుతో ఢీ లాంటి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. దానికి డీ అండ్ ఢీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.
ఇక ఆయనకు అవకశాలు రాకపోవడానికి కారణం ఫెయిల్యూర్స్ కారణమని, అందుకే ఎక్కువగా గ్యాప్ వచ్చిందని కథనాలు రాగా అందులో ఎలాంటి నిజం లేదని శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చారు. కేవలం కరోనా కారణంగానే గ్యాప్ వచ్చిందని ఇప్పటికే ఢీ లాంటి మరో కథ ఆల్ మోస్ట్ సిద్ధమయ్యిందని అన్నారు. ఇక కాంటిన్యూగా మూడు సినిమాలు కామెడీ జానర్ లోనే ఉంటాయని చెప్పారు. ప్రేక్షకుల తన నుంచి ఎలాంటి సినిమలైతే ఆశిస్తున్నారో అలాంటి సినిమాలే వస్తాయని కూడా చెప్పారు. ఇక శ్రీనువైట్ల ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.