twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ సినీ రచయిత మృతి.. శ్రీనువైట్ల ఎమోషనల్

    |

    కరోనా వైరస్ సోకి యువ రచయిత వంశీ రాజేష్ మరణించారు. ఈయన శ్రీను వైట్ల, గోపీమోహన్ కాంపౌండ్‌లో అనేక చిత్రాలను పనిచేశారు. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాకు రచనా విభాగంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తరవాత రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటొని' సినిమాకు కథ అందించారు. పూర్తి స్థాయి కథా రచయితగా తొలిసారి ఈ సినిమాకు పనిచేశారు. ఆయన చివరిగా 'శబ్దం' సినిమాకు పనిచేశారు. ఇది కూడా 2018లో విడుదల కావాల్సిన సినిమా.. కానీ ఇప్పటికీ ఇంకా రాలేదు.

    వంశీ రాజేష్ మృతి పట్ల శ్రీనువైట్ల ఎమోషనల్ అయ్యాడు. ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. నాకు మధురమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఆయన్ని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ట్వీట్ చేశాడు.

    Srinu vaitla ANd Gopi Mohan Condolence To Young Writer Vamshi Rajesh

    వంశీ రాజేష్ మృతి పట్ల గోపీ మోహన్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ఎంతో ప్రతిభావంతుడైన తెలుగు యువ రచయిత మరణించాడు. ఇది ఎంతో బాధాకరమైన విషయం.. ఆ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. వంశీ నిన్ను మేం మిస్ అవుతున్నాం అని ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Srinu vaitla ANd Gopi Mohan Condolence To Young Writer Vamshi Rajesh, Talented young telugu film writer Vamsi Rajesh is no more. Sad & Shocking News. My deep condolences to Vamsi Rajesh family. We miss you dear Vamsi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X