Don't Miss!
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యువ సినీ రచయిత మృతి.. శ్రీనువైట్ల ఎమోషనల్
కరోనా వైరస్ సోకి యువ రచయిత వంశీ రాజేష్ మరణించారు. ఈయన శ్రీను వైట్ల, గోపీమోహన్ కాంపౌండ్లో అనేక చిత్రాలను పనిచేశారు. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాకు రచనా విభాగంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తరవాత రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటొని' సినిమాకు కథ అందించారు. పూర్తి స్థాయి కథా రచయితగా తొలిసారి ఈ సినిమాకు పనిచేశారు. ఆయన చివరిగా 'శబ్దం' సినిమాకు పనిచేశారు. ఇది కూడా 2018లో విడుదల కావాల్సిన సినిమా.. కానీ ఇప్పటికీ ఇంకా రాలేదు.
వంశీ రాజేష్ మృతి పట్ల శ్రీనువైట్ల ఎమోషనల్ అయ్యాడు. ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. నాకు మధురమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఆయన్ని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ట్వీట్ చేశాడు.
వంశీ రాజేష్ మృతి పట్ల గోపీ మోహన్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ఎంతో ప్రతిభావంతుడైన తెలుగు యువ రచయిత మరణించాడు. ఇది ఎంతో బాధాకరమైన విషయం.. ఆ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. వంశీ నిన్ను మేం మిస్ అవుతున్నాం అని ఎమోషనల్ అయ్యాడు.