Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యువ సినీ రచయిత మృతి.. శ్రీనువైట్ల ఎమోషనల్
కరోనా వైరస్ సోకి యువ రచయిత వంశీ రాజేష్ మరణించారు. ఈయన శ్రీను వైట్ల, గోపీమోహన్ కాంపౌండ్లో అనేక చిత్రాలను పనిచేశారు. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాకు రచనా విభాగంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తరవాత రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటొని' సినిమాకు కథ అందించారు. పూర్తి స్థాయి కథా రచయితగా తొలిసారి ఈ సినిమాకు పనిచేశారు. ఆయన చివరిగా 'శబ్దం' సినిమాకు పనిచేశారు. ఇది కూడా 2018లో విడుదల కావాల్సిన సినిమా.. కానీ ఇప్పటికీ ఇంకా రాలేదు.
వంశీ రాజేష్ మృతి పట్ల శ్రీనువైట్ల ఎమోషనల్ అయ్యాడు. ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. నాకు మధురమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఆయన్ని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ట్వీట్ చేశాడు.
వంశీ రాజేష్ మృతి పట్ల గోపీ మోహన్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ఎంతో ప్రతిభావంతుడైన తెలుగు యువ రచయిత మరణించాడు. ఇది ఎంతో బాధాకరమైన విషయం.. ఆ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. వంశీ నిన్ను మేం మిస్ అవుతున్నాం అని ఎమోషనల్ అయ్యాడు.