Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీనువైట్ల బాలీవుడ్ ‘దూకుడు’కి బ్రేక్..జూ ఎన్టీర్ ప్రొజెక్ట్ షురూ...!
'దూకుడు' సినిమా తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మొదట్లో 'దూకుడు' సినిమాను హిందీలో రిమేక్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి. ఈ సినిమా చేయడానికి సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపాడనీ, దాంతో తన బాలీవుడ్ ఎంట్రీని గ్రాండ్ గా చేసుకోవచ్చనీ శ్రీను వైట్ల ఆశపడ్డాడు. అయితే, సల్మాన్ డేట్స్ ఇప్పట్లో ఖాళీ లేనందున, ఈ ప్రాజక్ట్ ఆలస్యం అయ్యేలా వుంది.
దాంతో, తను ఇప్పటికే కమిట్ అయిన జూ ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయడానికే శ్రీను వైట్ల మొగ్గుచూపుతున్నాడు. త్వరలో షూటింగు ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్నాడు. బృందావనం" చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన సమంత త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం.
జూ ఎన్టీఆర్, శ్రీనువైట్ల తొలి కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం కోసం ' మాఫియా... ఓ మంచి కుటుంబం" అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంసమంతా ఇందులో కథానాయికగా నటించనుంది. గతంలో జూ ఎన్టీఆర్, సమంతా కలిసి 'బృందావనం'లో నటించిన సంగతి తెలిసిందే!