Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నయనతారను ఓదార్చిన బాలకృష్ణ
బాలకృష్ణ, నయనతార రీసెంట్ గా సింహా, ఆ తర్వాత రామరాజ్యం చిత్రాలు చేసారు.వీరిద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇక శ్రీరామరాజ్యం చిత్ర షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన నయనతార మంగళవారంతో ఆ చిత్ర షూటింగ్ను పూర్తి చేశారు. అనంతరం యూనిట్ సభ్యులందరినీ కలుసుకుని నమస్కరిస్తూ బాధగా సెలవు తీసుకుంది. ఆ సందర్బంగా ఆమె ఇక సెలవు అంటూ గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టింది. ఎందుకంటే ఆమె ఆ చిత్రం అనంతంర ఇక సినిమాలు చేయనని నిర్ణయం తీసుకుంది.
దాంతో ఆ రోజునే లాస్ట్ డే గా ఫీలైంది. కారణం వివాహనంతరం సినిమాల్లో నటించకూడదని నయనతారకు ప్రభుదేవా కండిషన్ పెట్టారు. అందుకు ఆమె కూడా సమ్మతించింది. అప్పుడు బాలకృష్ణ నయనతారను ఓదార్చుతూ వివాహానంతరం మళ్లీ నటించవచ్చని చెప్పగా ప్రభుదేవా నిబంధన గురించి నయనతార చెప్పినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభుదేవా, నయతార ముంబయిలో ఉంటున్నారు. వీరి వివాహం కూడా ముంబయిలోనే జరిగే అవకాశం ఉంది. శ్రీరామ రాజ్యంలో బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటిస్తున్నారు.