Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాని కామాంధుడు.. నరకం చూపించాడు.. మామా జాగ్రత్త.. సురేష్బాబుపై శ్రీరెడ్డి కామెంట్స్!
Recommended Video
ఇప్పటికే టాలీవుడ్లో పలువురి మీద సంచలన కామెంట్తో శ్రీ రెడ్డి వివాదాస్పద నటి శ్రీరెడ్డి కలకలం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మరోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. శ్రీ రెడ్డి ఈసారి నేచురల్ స్టార్ నాని పై వివాదాస్పద పోస్ట్ చేసింది. గతంలో నానీ తాట తీస్తా అని హెచ్చరించిన ఆమె ఈసారి ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. నిర్మాత సురేష్బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
|
శ్రీ రెడ్డి కామెంట్స్
టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ప్రకంపనల పుట్టిస్తోంది. ఇప్పటికే టాలివుడ్ లో పలువురి మీద కామెంట్స్ తో కలకలం రేపిన ఆమె తాజాగా మరో హీరో మీద గురిపెట్టింది. శ్రీ రెడ్డి ఈసారి నేచురల్ స్టార్ నాని పై వివాదాస్పద పోస్ట్ చేసింది. ఆమె ఏమన్నారంటే. ''తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాసుకోర నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెంకూడా సిగ్గు లేదా అలా చేయటానికి ఛి''.
|
ఒక కామాంధుడు
తాజాగా నాని ఒక షార్ట్ ఫిలింకు వాయిస్ ఇవ్వడం జరిగింది. అంజలి పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం కు నాని వాయిస్ ఎందుకని ప్రశ్నించింది శ్రీ రెడి. ఈ సందర్భాగా ఆమె నాని గురించి కామెంట్ చేస్తూ.. ''మంచి షార్ట్ ఫిల్మ్, అందరు చూడండి, అంతా బాగుంది కానీ నాని Voice ఎందుకు వాడే ఒక కామాంధుడు, మహేష్ బాబు వాయిస్ అయితే చాలా బాగుండేది, వెన్న లాంటి సున్నితమైన మనసున్న బాబు మా మహేష్ బాబు'' అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
|
సురేష్ బాబుపై కామెంట్స్
ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ చెయ్యడం జరిగింది. అక్కడితో ఆ విషయాన్ని శ్రీ రెడ్డి మర్చిపోయింది అనుకునే సరికి తాజాగా ఆమె నిర్మాత సురేష్ బాబుపై మరోసారి ఆరోపణలు చేసింది. ఆమె ఏమన్నారంటే.. ''సురేష్ మామ ఎలా వున్నావ్, ఆరోగ్యం జాగ్రత్త, ఎండలు బాగా వేస్తున్నాయి బయట, ఇంట్లోనే గమ్మునుండు'' అని శ్రీరెడ్డి కామెంట్ చేయడం గమనార్హం.
అభిరాంతో ఫోటోలు లీక్
గతంలో అభిరామ్ దగ్గుబాటితో అతిసన్నిహితంగా ఉన్న ఫోటోలను ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో శ్రీరెడ్డి లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో శ్రీరెడ్డికి రూ.5 కోట్లు ఇప్పించే విధంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్యవర్తిత్వం వహించారనే వార్తలు మీడియాలో సంచలనం రేపాయి.