శ్రీరెడ్డి లీక్స్.. పక్కలోకి తప్ప ఎందుకు పనికిరారు.. ఈసారి టార్గెట్ టాప్ డైరెక్టర్
Recommended Video

సినీ నటి, యాంకర్ శ్రీరెడ్డి మల్లిడి సోషల్ మీడియాలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి ఓ టాప్ డైరెక్టర్ను టార్గెట్గా చేసుకొని ఫేస్బుక్లో చేసిన పోస్టు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల దర్శకుడు మారుతి, ఓ నిర్మాతపై వ్యాఖ్యలు చేసిన ఆమె తన లీకుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఇదే..

అబద్దాలు చెప్పడంలో దిట్ట
టాలీవుడ్ డైరెక్టర్ను ఉద్దేశించి.. పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్దాలు చెప్పటంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకు పనికి రారని అతనికి ప్రగాఢ విశ్వాసం. ప్రామిసెస్ బ్రేక్ చేయడంలో వారి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సొగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండు ఎక్కువ అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

ఏమైనా కోసేసుకొంటాడు..
టెక్నికల్గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని. మా ఇంటికి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకొంటాడు పాపం. ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. ఇంతకీ అతను ఎవరు అని అనుకొంటున్నారా? అతడే కొమ్ములు వచ్చిన శేఖరుడు అని ట్వీట్లో పేర్కొన్నది.

చెన్నైకి మొదటి బహుమతి
ఇక దక్షిణాది రంగంలో స్థానిక అవార్డులను కూడా ఆమె ప్రకటించింది. స్థానిక ఆర్టిస్టులకు ప్రోత్సాహం అందించడంలో చెన్నైకి మొదటి బహుమతి, ఆ తర్వాత కేరళకు రెండో బహుమతి అని మరో పోస్టులో పేర్కొన్నది. దక్షిణాది టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో చెన్నై టాప్ అని పేర్కొన్నది.

మానసికంగా విసిగిపోయాను
టాలీవుడ్కు సంబంధించిన అంతర్గత విషయాలను బయటపెడుతున్న నేపథ్యంలో కొందరు తనను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. అయితే నాకు చావంటే భయం లేదు. ఇప్పటికే మానసికంగా విసిగివేసారి పోయాను. వేధించడం మానేయండి. దాని వల్ల ఉపయోగం లేదని ఇటీవల మీడియాకు వెల్లడించింది.


Click it and Unblock the Notifications











