Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
శ్రీరెడ్డి మరోసారి సంచలనం.. మళ్లీ రోడ్డెక్కి నిరసన!
Recommended Video
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా తారలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దికాలంగా టాలీవుడ్ ప్రముఖులపై ఫైర్ అవుతున్న శ్రీరెడ్డి తాజాగా వినూత్న నిరసన తెలిపి ఆకట్టుకొన్నారు. ఈ సారి ఆమె చెప్పట్టిన నిరసనపై సోషల్ మీడియాలో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాలో
మల్లికార్జునస్వామిని దర్శించుకొనేందుకు శ్రీరెడ్డి శైలం ప్రయాణం అయ్యారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి సమీపంలో ఉపాధి కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దాంతో కారు ఆపి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తమకు ఉపాధి పనులు కల్పించడం లేదని ఈ సందర్భంగా కూలీలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
బాధలు తెలుసుకొని
కూలీల బాధలు తెలుసుకొని వెంటనే స్పందించారు. వారితో కలిసి కొంతసేపు రోడ్డుపై తనదైన శైలిలో నిరసన తెలిపారు. దారినపోయే వాహనాదారులందరూ శ్రీరెడ్డిని చూసి ఆగిపోయారు. దాంతో రోడ్డుపై కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
శ్రీరెడ్డి నిరసన
శ్రీరెడ్డి చేసిన నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉపాధి కూలీలకు సమస్యలపై స్పందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో కొంత హాడావిడి చేశారు. స్థానికులతో కాసేపు మాట్లాడి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు.
ప్రముఖులకు చురకలు
ఇదిలా ఉండగా, తన ఇంటర్వ్యూ తీసుకొన్న దుబాయ్ ప్రతిక ఖలీజ్ టైమ్స్కు, అవుట్ లుక్ మ్యాగజైన్కు, బిజినెస్ స్టాండర్డ్ మ్యాగజైన్కు శ్రీరెడ్డి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు కొందరు సినీ ప్రముఖులకు చురకలు అంటించారు. స్థానిక మీడియాను మీరు కొనొచ్చు. కానీ జాతీయ, అంతర్జాతీయ మీడియాను కొనగలరా? అని ప్రశ్నించారు.
బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి విమర్శ
తెలుగు రాష్ట్రాల్లో ఇందిరాగాంధీ సమయంలో కొనసాగిన ఎమర్జెన్సీ ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ సమయంలో మీడియాకు విద్యుత్ సరఫరా చేయకుండా అడ్డుకొన్నారు. అలాగే నా వార్తలను కవర్ చేయవద్దని రిపోర్టలపై కొందరు ఒత్తిడి తెస్తున్నారు. కావాలంటే డబ్బు ఇస్తాం లేదా టీవీ ఛానెల్ ముసుకొంటారా? అని కొందరు ప్రముఖులు బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి తెలిపారు.