twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమా అనగానే అమాంతం రేటు పెంచేసింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమా అనగానే భారీ బడ్జెట్ గుర్తుకు వస్తుంది. దాంతో ఆటోమేటిక్ గా అందరి రెమ్యునేషన్స్ అందుకు తగినట్లు పెరిగిపోతాయి. తాజాగా శృతి హాసన్ సైతం తన రెమ్యునేషన్ ని 1.25 కి పెంచి వసూలు చేస్తోందిట. మహేష్ చిత్రం కోసం ఆమె డేట్స్ అడిగితే ఈ రేటుకయితే చేస్తానని చెప్పి, ఓకే చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అంతకుముందు కోటి రూపాయలు ఉండే ఆమె రెమ్యునేషన్ మరో పాతిక పెరగటానికి మహేష్ హీరో కావటమే కారణం అంటున్నారు.

    చిత్రం విషయానికి వస్తే... 'ఆగడు' తరవాత స్వల్ప విరామం తీసుకొన్నాడు మహేష్‌బాబు. ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అవుతున్నారు. మహేష్‌ హీగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'మిర్చి' తరవాత ఆయన రూపొందిస్తున్న చిత్రమిదే. శ్రుతి హాసన్‌ హీరోయిన్. ఈ నెల 30 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు.

    నవంబరు 3 నుంచి మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొంటారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ''మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయ''ని చిత్రబృందం చెబుతోంది.

    మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

    Sruthi charging Bomb for Mahesh film

    దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

    నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

    ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

    English summary
    shruti hassan, will be romancing Mahesh babu for the first time and sources say a bomb of 1.25 crores has been charged.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X