శృతి మించిన శృతిహాసన్( హాట్ ఫోటోలు)
హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. త్వరలో విడుదల కానున్న రవితేజ చిత్రం బలుపు స్టిల్స్ ...అందుతున్న సమాచారం ప్రకారం..ఆమె ఆ సినిమాలో శృతి మించి అందాల ప్రదర్శన చేయటమే కాక రెచ్చిపోయి నటించిందని చెప్తున్నారు.
ఇప్పటికే విడుదలైన 'బలుపు' పాటలు యూత్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్ ఈ చిత్రంలో కాస్త శృతిమించిందని కొత్తగా విడుదలైన స్టిల్సే చెబుతున్నాయి. ఈ చిత్రంతో తెలుగులో పాగా వేయడానికి సిద్ధపడుతోంది శృతిహాసన్.
కమల్ హాసన్ కూతురు గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ప్రారంభంలో పెద్దగా కలిసిరాలేదు. 'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్. ఇక ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తూ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.
బలుపు చిత్రం విడుదల అయితే ఇక్కడ పూర్తిగా సెటిలైనట్లే అని చెప్తోంది... ఆమె స్టిల్స్ స్లైడ్ షో లో ..

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తమ సంస్థకు ఓ మంచి హిట్గా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకం ఉందని, శృతిహాసన్, అంజలి గ్లామర్, నటన ఈ చిత్రానికి హైలెట్స్గా ఉంటాయని, లక్ష్మీరాయ్ అతిథిగా నటించడం ఈ చిత్రానికి మరో స్పెషల్గా మారిందని తెలిపారు.

కోన వెంకట్ అందించిన కథతో దర్శకుడు అద్భుతమైన చిత్రాన్ని తీర్చిదిద్దారని, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని తెలిపారు.

అప్పట్లో అల్లరి నరేష్ తో కె విశ్వనాధ్ రూపొందించిన శుభప్రదం చిత్రంలో శృతిను అడిగారు.అయితే ఆమె చేయలేదు.
దానికి కారణం చెప్తూ... ఆ సమయంలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవటమేనంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్.

ఇక ఆ మద్యన సిద్దార్ద తో ఆమె డేటింగ్ చేసి పాపులర్ అయ్యింది. అయితే ఆ ముచ్చట ఎంతో కాలం నిలవలేదు.

రవితేజ శారీరక భాషకు తగ్గ కథతో, పర్ఫెక్ట్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ మంచి సంగీతాన్ని అందించాడు. పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.

వైజాగ్ బ్యాక్ డ్రాప్తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు.

పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత.

ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని ‘డాన్శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం రిజల్ట్ పై శృతిహాసన్ ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ లో సెటిలవుతానని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











