మహేష్ బాబు ను పొగడ్తలతో ముంచెత్తిన దర్శక ధీరుడు!
'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన 'భరత్ అనే నేను' భారి అంచనాల మద్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపైమహేష్ కి 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ప్లస్ పాయింట్.
ఈ చిత్రలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ అందించాడు. దేవి అందించిన పాటలు, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. ఈ సినిమా చుసిన కొందరు సిని ప్రముఖులు సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం జరిగింది.

భరత్ అనే నేను సినిమా చుసిన రాజమౌళి స్పందిస్తూ... ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సమస్యలను కొరటాల శివ అద్భుతంగా చూపించడం జరిగింది. మహేష్ బాబు నటన సినిమాకు బాగుందని, ముఖ్యంగా ప్రెస్ మీట్ సీన్ బాగుందని సినిమాను మెచ్చుకోవడం జరిగింది. తన తదుపరి సినిమా చేస్తున్న డివివి దానయ్యకు అభినందనలు తెలపడం జరిగింది.


Click it and Unblock the Notifications











