శ్రీకృష్ణ కమిటీరిపోర్టు మ్యాటర్ పై రాజమౌళి రిక్వెస్ట్..
ఒకటి, రెండు రోజుల్లో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు బహిర్గంతం కానున్న ఈ సమయంలో ఆంద్రప్రదేశ్ ప్రజలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసారు. రీపోర్టును మీరు స్వయంగా చదివే దాకా ఏ విధమైన కంక్లూజన్ కి రావద్దని అన్నారు. అలాగే మీడియాని ఉద్దేశిస్తూ...బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ సమయంలో సంయమనం చూపి ఎలా గౌరవం పొందిందో అలాగే ఈ శ్రీకృష్ణ కమిటీ విషయంలోనూ మీడియా వ్యవహరిస్తుందని ఆశిస్తుందని అన్నారు. అలాగే దాదాపు ఆరువందల పేజీలు వరకూ ఉండే ఈ రిపోర్ట్ విషయంలో చదువుకున్న వారి గైడన్స్ ని నిరక్షరాస్యులు తీసుకుంటే బావుంటుందన్నట్లు సూచించారు. ప్రస్తుతం రాజమౌళి..ఈగ అనే చిత్రం రూపొందిస్తున్నారు. నాని, సమంత కాంబినేషన్ లో చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు సందీప్ విలన్ గా చేస్తున్నాడు.
More from Filmibeat
రాజమౌళి ట్విట్టర్ బాబ్రీ మసీద్ ఈగ సునీల్ మర్యాద రామన్న rajamouli maryada ramanna sunil saloni magadheera eega


Click it and Unblock the Notifications











