Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి - తారక్ ఖాతాలోకి అరుదైన ఘనత.. పన్నెండేళ్ల తర్వాత అక్కడ రిలీజ్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. కానీ, రాజమౌళికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు కూడా. సినిమాల పరంగానే కాదు.. బయట కూడా వీళ్లిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. అందుకే ఆ బాండింగ్ ఉంది. వీళ్ల కాంబినేషన్లో విడుదలైన 'యమదొంగ' తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సూపర్ హిట్ కాంబినేషన్
దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్ర రావు శిష్యుడిగా ‘స్టూడెంట్ నెం.1' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్తోనే ‘సింహాద్రి' అనే సినిమాను చేశాడు. ఇక, వీళ్ల కాంబినేషన్లో ‘యమదొంగ'తో హ్యాట్రిక్ హిట్స్ నమోదయ్యాయి. ఈ మూడు చిత్రాలూ తారక్ను స్టార్ హీరోగా మార్చాయి. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
కీలక సమయంలో హిట్లు ఇచ్చాడు
హీరోగా ఎన్టీఆర్ మొదటి ప్రయత్నమే ఫెయిల్ అయింది. ఆ సమయంలో రాజమౌళి ‘స్టూడెంట్ నెం.1' రూపంలో ఫస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు వస్తున్న సమయంలో ‘సింహాద్రి'తో ఎన్టీఆర్ను ఒడ్డున పడేశాడు. దీని తర్వాత కూడా చాలా కాలం ప్లాప్ సినిమాలు వచ్చాయి. అప్పుడు ‘యమదొంగ'తో మరో హిట్ ఇచ్చి తారక్ను నిలబెట్టాడు జక్కన్న.
‘యమదొంగ' ప్రత్యేకమైనది
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహన్ దాస్ నటించిన చిత్రం ‘యమదొంగ'. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. 2007లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, అప్పటి వరకు లావుగా కనిపించిన తారక్.. ఇందులో స్లిమ్గా కనిపించాడు. దీని తర్వాత తారక్ వెనుదిరిగి చూడలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.
Recommended Video
12 ఏళ్ల తర్వాత వస్తోంది
విడుదలైన 12 సంవత్సరాల తర్వాత ‘యమదొంగ' అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. సుదీక్షా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తోంది. ఏఆర్కే రామరాజా ఈ సినిమాకు మాటలు, పాటలు రాస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.