Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
RRRకు మరోషాక్.. రాజమౌళికి అలియా ఝలక్
Recommended Video
బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్ర షూటింగ్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఉత్తరాదిలో ప్రారంభించిన షూటింగ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గాయపడటంతో తొలిసారి వాయిదా పడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయాల బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా జరుగుతున్న షూటింగ్కు బాలీవుడ్ నటి ఆలియాభట్ మరోసారి షాకిచ్చింది.
బ్రహ్మస్త్రలో ప్రియుడితో
బాలీవుడ్ హీరో రణ్బీర్ సింగ్తో కలిసి ఆలియాభట్ తాజాగా బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నది. ఇటీవల బనారస్లో జరిగిన చిత్రీకరణతో బ్రహ్మస్త్ర షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత నేరుగా RRR చిత్రంలో పాలొంటారని భావించారు. కానీ ఆలియా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ చిత్ర షూటింగ్కు హాజరుకాలేకపోయింది.
రాజమౌళికి చెప్పకుండా ఆలియా
కొద్ది రోజుల క్రితం అనారోగ్యం నుంచి కోలుకొన్న ఆలియాభట్ RRR షూటింగ్లో పాల్గొంటారని మరోసారి అనుకొన్నారు. కానీ రాజమౌళికి షాకిచ్చి నేరుగా ప్రియుడి రణ్బీర్తో కలిసి అమెరికాకు వెళ్లింది. RRR షూటింగ్ ఏర్పాట్లలో ఉన్న రాజమౌళికి ఇది తెలిసి షాకయ్యారట. ఆలియా వస్తే షూటింగ్ చేద్దామనుకొన్న సీన్లను తర్వాత చిత్రీకరించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
రణ్బీర్తో కలిసి దీపికా
రణ్బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషీ కపూర్ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్నారు. తన తల్లి నీతూ కపూర్ కూడా అక్కడే ఉండటంతో రణ్బీర్ తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లారట. దాంతో రణ్బీర్తోపాటు ఆలియా కూడా అమెరికాకు చెక్కేయడం RRR సినిమా యూనిట్ను ఇబ్బందుల్లో పడేసింది.
ఎన్టీఆర్, రాంచరణ్లపై
దాంతో ఎన్టీఆర్, రాంచరణ్తో సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు ప్లాన్ చేశారట. ఆలియా భట్ వచ్చిన తర్వాత కాంబినేషన్ సీన్లు చిత్రీకరించేలా షూటింగ్ను డిజైన్ చేశారు. ఇలా వరుస షాక్లో ముందుకెళ్తున్న ఈ చిత్రం 2020, జూలై 30న విడుదల చేసేందుకు డేట్ను ఫిక్స్ చేసుకొన్న సంగతి తెలిసిందే.