Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పాకిస్థాన్లో పండగ, థాంక్స్ చెప్పిన రాజమౌళి... త్వరలో ప్రయాణం, ఎందుకో తెలుసా?
Recommended Video
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి త్వరలో పాకిస్థాన్ వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్థాన్కు థాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. పాక్ వెళ్లి అక్కడ జరిగే సినిమా పండగ(ఫిల్మ్ ఫెస్టివల్)లో ఈ దర్శక ధీరుడు పాల్గొనబోతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితం అయింది. ఈ క్రమంలో ఆయన ఆయా దేశాలు పర్యటించారు. తాజాగా పాకిస్థాన్ దేశంలోని కరాచీలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి ప్రదర్శించబోతున్నారు.
దీనిపై రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'బాహుబలి' చిత్రం వల్ల వివిధ ప్రదేశాల్లో పర్యటించే అవకాశం దక్కింది. అయితే వాటన్నింటికంటే ఇపుడు పాకిస్థాన్లో ట్రావెల్ చేయడం మరింత ఎగ్జైటింగ్గా ఉంది. నన్ను ఆహ్వానించిన 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, కరాచీ' వారికి ధన్యవాదాలు అని రాజమౌళి ట్వీట్ చేశారు.
Baahubali has given me opportunities to travel to a number of countries... The most exciting of them all is now, Pakistan. Thank you Pakistan international film festival, Karachi for the invite.
— rajamouli ss (@ssrajamouli) March 28, 2018
పాకిస్థాన్లో హిందీ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఎన్నో బాలీవుడ్ చిత్రాలు అక్కడ కూడా విడుదలై మంచి విజయం సాధించాయి. పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి చిత్రం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.... దీన్ని కూడా పాక్లో విడుదల చేసే అవకాశం ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.