Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్పీల్బర్గ్ నన్ను మెచ్చుకున్నారు: ప్రకాష్ రాజ్
ప్రకాష్రాజ్ మాట్లాడుతూ... ''ఆ చిత్రం చూశాను అని చెప్పడమే కాదు... చిత్ర కథ గురించీ, నా నటన గురించీ చెప్పారు. 'కళ్లతోనే హావభావాలు పలికించారు. క్లిష్టమైన భావోద్వేగాల్ని చూపించిన తీరు బాగుంద'న్నారు. ఓ నటుడిగా నాకు చాలా సంతోషకరమైన క్షణాలవి. నేను స్పీల్బర్గ్ ప్రశంసను అందుకొంటానని ఏ రోజూ వూహించలేదు'' అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.... '' ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతోపాటు మరాఠీలోనూ నటిస్తున్నాను. ఇక తమిళంలో ఓ ఛానెల్ కోసం నీలంగళుమ్ వెల్లాలమ్ ఒరుకోడి అనే కార్యక్రమం చేస్తున్నాను. దీని ద్వారా భిన్న వర్గాలకు చెందినవాళ్లను కలుసుకొని, సామాజిక పరిస్థితులు, వారి ఆలోచనలను తెలుసుకొనే వీలు కలుగుతోంది''అన్నారు.
ఇటీవల స్టీవెన్ స్పీల్బర్గ్ మన దేశం వచ్చారు. ఆ సమయంలో అనిల్ అంబానీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన చిత్ర ప్రముఖులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంలో స్పీల్బర్గ్కి ప్రకాష్రాజ్ని పరిచయం చేసినప్పుడు 'కంజీవరం' చూశానని చెప్పారు. దీని గురించి ప్రకాష్ రాజ్ ప్రస్తావించింది. ఇక మంగళవారం ప్రకాష్రాజ్ జన్మదినం. త్వరలో ఆయన తెలుగులో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.