Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
కేసీఆర్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
హైదరాబాద్ : సమగ్ర కుటంబ సర్వే జరిగిన రోజు తాను ఇంట్లో లేనని సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. భాజపా అధ్యక్షుడు అమిత్షాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా పాల్గొనాలన్నందునే తాను సర్వేలో పాల్గొనలేదని తెలిపారు.నేతలు ఇకనైనా ద్వేషం వెళ్లగక్కకుండా ఉంటే మంచిదన్నారు. ఇద్దరు సీఎంలు రెండు నెలల క్రితమే చర్చలు జరిపితే సమస్యలు తీరేవన్నారు. కేసీఆర్ దక్షతగల నాయకుడిగా పాలన కొనసాగించాలన్నారు.
అమిత్షాతో జనసేన దళపతి, సినీ హీరో పవన్కల్యాణ్ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు వచ్చి... బేగంపేటలోని టూరిజం హోటల్లో బస చేసిన అమిత్ షాను రాత్రి 10.45 గంటల ప్రాంతంలో పవన్ కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ, టీడీపీ భావిస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ సమగ్ర సర్వేలో పాల్గొనక పోవడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనలేదని ఓ విలేకరి ప్రస్తావించినప్పుడు... పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉండదలుచుకోలేదేమోనని, కేవలం టూరిస్టుగానే తెలంగాణలో ఉండదలుచుకున్నాడేమోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమగ్ర సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ అన్నారు. ప్రభుత్వ సర్వేలో పాల్గొనక పోవడం సామాజిక నేరమని వ్యాఖ్యానించారు.
అలాగే ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సమయం వచ్చినప్పుడల్లా ఆయనపై పైన ఎగిరిపడ్డారు. తెలంగాణలో తెరాస గెలిచిన తర్వాత పవన్ స్పందిస్తూ.. ఇప్పటికైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఇప్పుడూ అదే మళ్లీ చెప్పారు.
ఎన్నికల ప్రచారం సమయంలో తెలంగాణలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. తెరాస పైన, కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్ కూడా ధీటుగా స్పందించారు. గాలికి కొట్టుకుపోతాడంటూ పవన్ను హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇరువురు పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు సర్వేలో పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం చర్చనీయాంశమైంది.