Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆ విజువల్స్ ఆపండి: హరికృష్ణ మరణంపై మీడియాకు మంచు మనోజ్ రిక్వెస్ట్
నందమూరి హరికృష్ణ మరణంపై నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విని షాకయ్యానని, వారి కుటుంబానికి, అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. హరికృష్ణ అంకుల్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఒక రిక్వెస్ట్ చేశారు. యాక్సిడెంట్ దృశ్యాలను ప్రసారం చేయవద్దని కోరారు. ఆ విజువల్స్ టీవీలో పదే పదే చూపించడం వల్ల కుటుంబ సభ్యులు, అభిమానులు మరింత బాధకు గురవుతున్నారని, దయచేసి వాటిని ప్రసారం చేయడం ఆపాలన్నారు.
Request the media to stop telecasting #HariKrishna garu’s post accident visuals..It’s disheartening for his family & followers to witness their loved one in such an unexpected way..He belongs to all of us! Pls show some respect🙏🏻Hope u oblige our request.Tq #RIPHarikrishnaGaru
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) August 29, 2018
హరికృష్ణ గారు మనందరికీ చెందిన వ్యక్తి... ఆయన పట్ల గౌరవం చూపాలని కోరుకుంటున్నాను. నా రిక్వెస్ట్ను మీడియా వారు పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు అంటూ మనోజ్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా హరికృష్ణకు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కాగా... హరికృష్ణ భౌతికకాయాన్ని నార్కట్పల్లి ఆసుపత్రి నుండి హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకొస్తున్నారు. శుక్రవారం మొయినాబాద్లోని ఫాం హౌస్లో అంత్యక్రియలు జరుగనున్నాయి.