""హీరోలకన్నా కథే మిన్న""

By Staff

చక్కని కథ, దానిని అద్భుతంగా తెరకెక్కించడమే అన్నిటికన్నా ముఖ్యమని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంటున్నారు. ఈ రెండు సరిగా ఉంటే టెక్నిక్స్ తో పనిలేదని ఆయన అంటున్నాడు. కథ కోసమే ప్రేక్షకులు సినిమాకు వస్తారు కానీ మరే విషయాలు పట్టించుకోరని అంటున్నారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన మణిరత్నం మీడియాతో మాట్లాడారు. కథను కన్విన్సింగ్ గా చెప్పడమే తనకు చాలా ముఖ్యవిషయమని, అందుకు తగినట్టుగా నటీనటుల నటన అవసరమని, మంచి కథ ఉన్నా నటులు న్యాయం చేయకపోతే వృథా అవుతుందని అంటున్నారు. అయినా నటుల కన్నా కథే మిన్న అని ఆయన స్పష్టం చేశారు. నాయకుడు, రోజా, బొంబాయి, దిల్ సే, దళపతి, అంజలి, యువ, గురు తదితర సినిమాలు చేసిన మణిరత్నం మాట్లాడుతూ...ఎవరైనా కథ రాస్తున్నారంటే ప్రస్తుత స్థితి గతులను పరిగణనలోకి తీసుకోవాలి...అపుడే చక్కని కథలు రూపొందుతాయి...అపుడే ప్రేక్షకులు సినిమా తమకు సంబంధించినదిగా భావిస్తారు...నేను ఇళయరాజా, రహమాన్ తో పనిచేశాను...ఇద్దరూ అద్భుత కంపోజర్లు...ఇద్దరి బాణీ వేరు. ఇళయరాజా చాలా వేగంగా కంపోజ్ చేస్తే, రహమాన్ సమయం తీసుకుంటాడు...ఆలోచిస్తాడు...అని అన్నాడు మణిరత్నం.

More from Filmibeat

Read more about: mani ratnam telugu movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X