Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
""హీరోలకన్నా కథే మిన్న""
చక్కని కథ, దానిని అద్భుతంగా తెరకెక్కించడమే అన్నిటికన్నా ముఖ్యమని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంటున్నారు. ఈ రెండు సరిగా ఉంటే టెక్నిక్స్ తో పనిలేదని ఆయన అంటున్నాడు. కథ కోసమే ప్రేక్షకులు సినిమాకు వస్తారు కానీ మరే విషయాలు పట్టించుకోరని అంటున్నారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన మణిరత్నం మీడియాతో మాట్లాడారు. కథను కన్విన్సింగ్ గా చెప్పడమే తనకు చాలా ముఖ్యవిషయమని, అందుకు తగినట్టుగా నటీనటుల నటన అవసరమని, మంచి కథ ఉన్నా నటులు న్యాయం చేయకపోతే వృథా అవుతుందని అంటున్నారు. అయినా నటుల కన్నా కథే మిన్న అని ఆయన స్పష్టం చేశారు. నాయకుడు, రోజా, బొంబాయి, దిల్ సే, దళపతి, అంజలి, యువ, గురు తదితర సినిమాలు చేసిన మణిరత్నం మాట్లాడుతూ...ఎవరైనా కథ రాస్తున్నారంటే ప్రస్తుత స్థితి గతులను పరిగణనలోకి తీసుకోవాలి...అపుడే చక్కని కథలు రూపొందుతాయి...అపుడే ప్రేక్షకులు సినిమా తమకు సంబంధించినదిగా భావిస్తారు...నేను ఇళయరాజా, రహమాన్ తో పనిచేశాను...ఇద్దరూ అద్భుత కంపోజర్లు...ఇద్దరి బాణీ వేరు. ఇళయరాజా చాలా వేగంగా కంపోజ్ చేస్తే, రహమాన్ సమయం తీసుకుంటాడు...ఆలోచిస్తాడు...అని అన్నాడు మణిరత్నం.