Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
""హీరోలకన్నా కథే మిన్న""
చక్కని కథ, దానిని అద్భుతంగా తెరకెక్కించడమే అన్నిటికన్నా ముఖ్యమని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంటున్నారు. ఈ రెండు సరిగా ఉంటే టెక్నిక్స్ తో పనిలేదని ఆయన అంటున్నాడు. కథ కోసమే ప్రేక్షకులు సినిమాకు వస్తారు కానీ మరే విషయాలు పట్టించుకోరని అంటున్నారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన మణిరత్నం మీడియాతో మాట్లాడారు. కథను కన్విన్సింగ్ గా చెప్పడమే తనకు చాలా ముఖ్యవిషయమని, అందుకు తగినట్టుగా నటీనటుల నటన అవసరమని, మంచి కథ ఉన్నా నటులు న్యాయం చేయకపోతే వృథా అవుతుందని అంటున్నారు. అయినా నటుల కన్నా కథే మిన్న అని ఆయన స్పష్టం చేశారు. నాయకుడు, రోజా, బొంబాయి, దిల్ సే, దళపతి, అంజలి, యువ, గురు తదితర సినిమాలు చేసిన మణిరత్నం మాట్లాడుతూ...ఎవరైనా కథ రాస్తున్నారంటే ప్రస్తుత స్థితి గతులను పరిగణనలోకి తీసుకోవాలి...అపుడే చక్కని కథలు రూపొందుతాయి...అపుడే ప్రేక్షకులు సినిమా తమకు సంబంధించినదిగా భావిస్తారు...నేను ఇళయరాజా, రహమాన్ తో పనిచేశాను...ఇద్దరూ అద్భుత కంపోజర్లు...ఇద్దరి బాణీ వేరు. ఇళయరాజా చాలా వేగంగా కంపోజ్ చేస్తే, రహమాన్ సమయం తీసుకుంటాడు...ఆలోచిస్తాడు...అని అన్నాడు మణిరత్నం.