twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ థ్రిల్లర్ కథేంటి

    By Staff
    |

    Sekhar
    'ఎ ఫిల్మ్ బై అరవింద్"తో తెలుగు జనాన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ వైపు నెట్టిన ఘనత శేఖర్ సూరిది. ఆ ట్రెండు ని కంటిన్యూ చేస్తూ అనసూయ,మంత్ర వచ్చి హిట్టయ్యాయి. అంతే గాక మరెన్నో థ్రిల్లర్స్ తయరవుతున్నాయి. దాంతో అతను మరోసారి అదే రీతిలో జనాన్ని థ్రిల్ చేయాలనుకుంటున్నాడు. "త్రీ" పేరుతో మరో సస్పెన్స్, హారర్ సినిమాను రూపొందిస్తున్నాడు. అందులోను 'ఎ ఫిల్మ్ బై అరవింద్" హీరోలు రిషి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ శృంగార ఊర్వశీ శర్మ హీరోయిన్ పాత్రను చేస్తోంది.టైటిల్ గమ్మత్తుగా ఉండటంతో కథ యేంటని అందరికి ఆసక్తి కలుగుతోంది.

    ఈ సినిమా కథ పదమూడు పాత్రలతో మొదలవుతుంది. వారు కథా గమనంలో ఒకరు తరువాత మరొకరు చనిపోయి చివరకి వారిలో ముగ్గురు మిగిలుతారు. వారే 'త్రీ"(రిషి, రాజీవ్ కనకాల ,శాంతిచంద్ర అనే నూతన నటుడు ). వారు ఎదుర్కొనే ఆ ప్రమాదమేమిటి వారు మాత్రం ఎలా తప్పించుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ . అదే ప్రేక్షకుల్లో టెన్షన్ కలిగిస్తుంది. అందుకే ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్‌గా చెప్పొచ్చని శేఖర్ చెపుతున్నాడు. ట్రైలర్ల విడుదలైన ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి దాకా ఈ సస్పన్స్ భరించకతప్పదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X