Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐస్లాండ్లో శుభలేఖ రాయనున్న రామ్ చరణ్
హైదరాబాద్ : చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో ' ఇళయరాజా సంగీతం అందించిన ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటను రామ్ చరణ్ హరోగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో రూపొందుతున్న 'నాయక్' చిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు.
ఈ సాంగు చిత్రీకరణ ఆగస్టు 22 నుంచి ఐస్ లాండ్ ద్వీపంలో జరుగనుంది. తొలత ఈ పాటను కాజల్తో చిత్రీకరించాలని భావించినప్పటికీ చివరకు అమపాల్తో చిత్రీకరించాలని నిర్ణయించాడు దర్శకుడు. సంగీత దర్శకుడు తమన్ కు ఎంతో ఇష్టమైన ఈ పాటను విపరీత సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చక్కనైన మెలోడి సాంగ్ గా కంపోజ్ చేస్తున్నారు . చిరంజీవి హిట్ సాంగ్స్ రీమిక్స్ చేసిన రెండు చిత్రాలు 'మగధీర', 'రచ్చ' ఘన విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కుడా వర్క్ అవుట్ అయ్యి చరణ్ కు ఈ చిత్రం మరో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.
బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, రాహుల్దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, నిర్మాత : డివివి దానయ్య, దర్శకత్వం : వివి వినాయక్