twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం..తెలుగులో గొప్ప దర్శకులుకు కరువా?

    By Srikanya
    |

    ప్రముఖ దర్శక,నిర్మాత సుభాష్ ఘయ్ మన రాష్ట్రంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టడానికి హైదరాబాద్‌-చేవెళ్ల ప్రధాన రహదారిలో ఇరవై ఎకరాల స్ధలం కేటాయిస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. అయితే తెలుగు చలన చిత్రరంగంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఉండగా వారిని కాదని రూ.400 కోట్ల భూమిని అంతర్జాతీయ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేరుతో సుభాష్‌ ఘయ్‌ అండ్‌ కంపెనీకి నామమాత్రపు మొత్తానికి ఇవ్వడంలో అంతర్యమేమిటని అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా పక్షనాయకుడు దాడి వీరభద్రరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. ముంబయిలో ఘయ్‌ కంపెనీ ఇలాంటి సంస్థనే ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి ఇంతవరకు ఒక్కరూ పట్టా తీసుకొని బయటికి రాలేదని దాడి వీరభద్రరావు విమర్శించారు.

    అలాగే ఈ ఇష్యూకు సంబంధించిన జీవోఅర్థవంతంగా లేదని, రద్దు చేయాలని సీపీఐ సభ్యుడు పువ్వాడ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. అయితే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి చలనచిత్ర రంగంలో పేరొందిన సుభాష్‌ ఘయ్‌ అండ్‌ కంపెనీకి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఇందులో పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. గతంలో నాగేశ్వరరావు, రామానాయుడు, రాఘవేంద్రరావులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు పేదలకు ఉపయోగపడతాయనే ఇచ్చారా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ప్రశ్నించారు. సుభాష్‌ఘయ్‌ సాధారణ వ్యక్తి కాదని గుర్తుంచుకోవాలన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X