Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తనయుడి కాలేయ దానం.. సుద్దాల సర్జరీ సక్సెస్
ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నరకాలుగా వార్తలు వచ్చిన విసయం విదితమే. మొదట్లో ఇవి ఫేక్ అని కొట్టిపారేసినా.. నటుడు ఉత్తేజ్ వీడియో సందేశంతో ఆ వార్తలన్నీ నిజమేనని ప్రకటితమైంది. సుద్దాల అశోక్ తేజకే ఆరోగ్యం బాగా లేదని, ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగనున్నట్లుగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ కూడా అధికారికంగా ప్రకటించింది. దీంతో సుద్దాల ఆరోగ్యంపై అందరూ ఆందోళన చెందారు. అయితే నటుడు ఉత్తేజ్ వీడియో సందేశంలో అందరిలోనూ ఓ భరోసా వచ్చింది.
అలా చేయడంతో అందరికీ..
నటుడు ఉత్తేజ్, సుద్దాలకు బంధువు కూడా. తన మామయ్య ఆరోగ్యంపై ఉత్తేజ్ స్పందిస్తూ.. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఆయన సర్జరీలో భాగంగా బ్లడ్ అవసరముంటుందేమోనని ఆయన తన స్నేహితుడికి చెప్పాడని తెలిపాడు. దీంతో ఆయన ఆ విషయాన్ని ఫేస్ బుక్లో షేర్ చేసేసరికి విషయం అందరికీ తెలిసిందని పేర్కొన్నాడు.
బాగానే ఉన్నారు..
అయితే ఆ విషయం తెలుసుకుని అందరూ పలు రకాలుగా వార్తలు రాస్తున్నారని, అవన్నీ అబద్దమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని సర్జరీ చేయిస్తున్నామని తెలిపాడు. ఈ మేరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా డొనేటర్స్ కూడా వస్తున్నారని పేర్కొన్నాడు.
చిరు భరోసా..
సర్జరీ జరగబోతోందని తెలిసిన చిరంజీవి సుద్దాలతో మాట్లాడని, కొండంత ధైర్యమిచ్చాడని చెప్పుకొచ్చాడు. ఆయన మాటలతో ఎంతో బలం వచ్చిందని, ఇండస్ట్రీ మొత్తం మాట్లాడినట్టు అనిపిస్తుందిరా అని సుద్దాల అన్నట్టు ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు చేసిన సర్జరీ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
తనయుడి కాలేయ దానం..
హైదరాబాద్లోని గచ్చిబౌలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయనకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. సుద్దాల తనయుడు అర్జున్ తేజ్ కాలేయ దానం చేశారు. దాంతో సుద్దాల అశోక్ తేజకు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం మొదలైన ఆపరేషన్ సాయింత్రం వరకూ సాగిందని తెలుస్తోంది. ఇక సుద్దాల, ఆయన తనయుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యబృందం తెలిపింది.