Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబు బావ 'అగ్గిపుల్ల'లా
ఎస్.ఎమ్.ఎస్ చిత్రంతో పరిచయమైన మహేష్ బాబు త్వరలో అగ్గిపుల్ల గా కనిపించి అలరించనున్నారు. రక్ష చిత్రంతో పరిచయమైన వంశీ కృష్ణ ఆకెళ్ల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఓ యువ నిర్మాత ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక కోసం సెర్చింగ్ జరుగుతోంది.
కృష్ణ అల్లుడుగా పరిచయమైన సుధీర్ బాబు ఈ చిత్రంలో తన డాన్స్ లు,ఫైట్స్ తో పేరు తెచ్చుకున్నారు. తమిళ రీమేక్ గా రూపొందిన ఆ చిత్రం యావరేజ్ గా సెటిలైంది. సుధీర్ బాబు తన దృష్టిని యాక్షన్ ఎంటర్టైనర్స్ పైన పెడుతున్నారు. అటువంటి కథలంటేనే ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో తను యాక్షన్ హీరోగా సెటిలవుతానని ఆశగా ఉన్నారు. వంశీ కృష్ణ సైతం తనపై పడ్డ హర్రర్ ముద్రను చెరిపేసుకుని ఈ చిత్రంతో మెయిన్ స్ట్రీమ్ దర్శకులలో కలవాలనుకుంటున్నారు. వర్మ శిష్యుడైన వంశీ కృష్ణ అప్పల రాజు చిత్రానికి సైతం స్క్రిప్టు డిపార్టమెంట్ లో పనిచేసారు.