Don't Miss!
- News ఎన్నికల వేళ రేవంత్ కీలక నిర్ణయం - నేరుగా రంగంలోకి..!!
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మే 26న హీరో సుధీర్బాబు ప్రొడక్షన్స్ లోగో ఆవిష్కరణ
ప్రేమ కథా చిత్రం , భలే మంచి రోజు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాంటి విభిన్న ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో నటించిన హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్బాబు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ని స్టార్ట్ చేసారు.
మే 26న సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రొడక్షన్ లోగోని వైభవంగా ప్రారంభిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రిలో తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుని హ్యాండ్ సమ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తో కెరీర్ ని ముందుకు కొనసాగిస్తున్న సుధీర్బాబు నిర్మాత గా మారి వరుస చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రొడక్షన్ నెం1 గా ఓ చిత్రం ప్రారంభించి దాదాపు 80 శాతం కంప్లీట్ చేశారు. ప్రస్తుతం మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం గా వస్తున్న సమ్మెహనం విడుదల కి సిద్దంగా వుంది. అలానే మరో విభిన్న కథతో సిద్దమవుతున్న వీరభోగవసంత రాయులు అనే చిత్రం కూడా షూటింగ్ చివరి భాగంలో వుంది. ఇదిలా వుండగా అగష్టు నుండి పుల్లెల గోపిచంద్ బయోపిక్ షూటింగ్ తో బిజీ అవుతారు.. ఓ పక్క హీరోగా బిజీగా వుంటూనే మరో పక్క ప్రోడక్షన్ ప్రారంభిచటం విశేషం..