Don't Miss!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇక నిర్మాతగా కూడా: ప్రొడ్యూసర్గా మారిన సుధీర్ బాబు
కొన్ని కారణాల వలన సుధీర్ బాబు కొత్త సినిమా నిర్మాత చివరి నిమిషంలో పక్కకి తప్పుకున్నాడు. దాంతో ఈ యంగ్ హీరో ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తోంది. తన కొత్త చిత్రానికి తనే నిర్మాతగా వ్యవహరించబోతున
Recommended Video
ఒక ప్రేమకథా చిత్రం తో మంచి నటుడే అని మార్కులు వేయించుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత బాలీవుడ్ లో భాగీ సినిమాలో విలన్ గానూ మంచి ప్రశంసలనే అందుకున్నాడు. యాక్షన్ .. రొమాంటిక్ హీరోకి కావలసిన అన్ని లక్షణాలు మనకి సుధీర్ బాబులో కనిపిస్తాయి. కానీ పాపం ఎందుకనో సరైన గట్టి అవకాశం మాత్రం ఇప్పటి వరకూ రాలేదు సుధీర్ బాబుకి. 'భలేమంచి రోజు' తరువాత ఆ స్థాయి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
నూతన దర్శకుడు రాజశేఖర్ నాయుడు వినిపించిన కథ నచ్చడంతో, తాజాగా ఆయన ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాల వలన నిర్మాత చివరి నిమిషంలో పక్కకి తప్పుకున్నాడు. ఈ యంగ్ హీరో ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తోంది. తన కొత్త చిత్రానికి తనే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట.
రీసెంట్ గానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. రాజశేఖర్ నాయుడు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని వేరే నిర్మాతతోనే తలపెట్టారట. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఆ నిర్మాత వెనక్కు తప్పుకోవడంతో.. ఈ మూవీని తనే నిర్మించాలని ఫిక్స్ అయిపోయాడట సుధీర్ బాబు.
మూవీ కంటెంట్.. సబ్జెక్ట్.. కొత్త దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఇటు హీరోగా చేస్తూనే అటు ప్రొడక్షన్ కూడా చేసేయాలని సుధీర్ బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో..రవిబాబు దర్శకత్వం వహించిన 'అదుగో' సినిమాలో కథానాయికగా చేసిన 'నాభా నతేష్' ను .. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.