Don't Miss!
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శర్వా బ్రహ్మండమైన ఐడియా .. రణరంగంకు స్వీకెల్ ఉండొచ్చు.. సుధీర్ వర్మ
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. గ్యాంగ్స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు సుధీర్ వర్మ తెలుగు ఫిల్మీబీట్తో ముచ్చటించారు. రణరంగం సినిమా గురించి పలు విషయాలు సుధీర్ చెప్పారు.
స్వామిరారా సినిమా రిలీజ్ తర్వాత నిర్మాత చిన్నబాబు పిలిచి అడ్వాన్స్ ఇచ్చారు. అయితే సినిమా మాత్రం ఇప్పుడు కుదిరింది. నా కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రం. కానీ ఇప్పటి వరకు నిర్మాత నాగవంశీ నాకు బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పలేదు. సినిమా అవుట్ ఆయనకు ముఖ్యం. క్వాలిటీ తగ్గుకుండా సినిమా చేయమనే చెప్పాడు అని దర్శకుడు సుధీర్ వర్మ తెలిపారు.
ఇక నుంచి సితార బ్యానర్లో సినిమాలు ఉంటాయి. రణరంగం సినిమా చేసేటప్పుడే మరో సినిమా చేయమని అడిగారు. ఒకవేళ నీకు ఎవరైనా హీరో నచ్చితే చెప్పు.. ఆయనతో సినిమా చేద్దామని నాగవంశీ ఎంకరేజ్ చేశారు. మా మధ్య అలాంటి రిలేషన్ ఉంది. రణరంగం అందరికీ నచ్చుతుంది అని దర్శకుడు సుధీర్ వర్మ చెప్పారు.
రణరంగం సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యనే శర్వానంద్ ఓ ఐడియా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. రణరంగం సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తే, స్వీక్వెల్కు ప్లాన్ చేస్తాం. ఈ సినిమా రిలీజ్ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ పెరగడం అనేది కథ, ప్రొడక్షన్ను ఆధారపడి ఉంటుందన్నారు.