Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవారు: నటుడు రంగనాథ్ కూతురు
హైదరాబాద్: తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు. ఇవాళ ఉదయం నుంచి రంగనాథ్ ఏమీ తినలేదని ఆమె చెప్పారు. తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చినా లాభం లేకపోయిందని అన్నారు.
తమ్ముడు, చెల్లె బెంగళూరులో ఉంటారని, వారు ఎప్పుడూ ఇక్కడికి రాలేదని ఆమె చెప్పారు. సమాజం కూడా రంగనాథ్ను గుర్తించలేదని ఆమె చెప్పారు. తమకు ఏ విధమైన ఆస్తులు కూడా లేవని, చిన్న అద్దె ఇంట్లోనే ఉంటున్నామని ఆమె చెప్పారు. తన తల్లి 2009 నుంచి మరణించినప్పటి నుంచి రంగనాథ్ ఒంటరిగా ఫీలవుతున్నారని ఆమె చెప్పారు.
రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.
తలుపులు పగులగొట్టి చూసేసరికి రంగనాథ్ ఉరి వేసుకుని కనిపించారని, ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. కాగా, బ్యాంక్ డిపాజిట్లు మీనాక్షికి అప్పగించాలని, దానికి సంబంధించిన పత్రాలు బీరువాలో ఉన్నాయని రంగనాథ్ ఓ కాగితంపై రాసి పెట్టారు.
తాను ఒంటిరివాడినని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అంటుండేవారని మీనాక్షి చెప్పింది. గత మూడు రోజులుగా రంగనాథ్ మౌనంగా ఉంటున్నారని ఆమె చెప్పింది.