Don't Miss!
- News వైఎస్ కుటుంబంలో మరోసారి పోటీ ! ఫ్యామిలీని ఒప్పించబోతున్న షర్మిల-తర్వాతే ప్రకటన..
- Sports సన్రైజర్స్కు బ్యాడ్ న్యూస్.. నయా ఆల్రౌండర్ దూరం
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఒక్కమాట నోరుజారి చిక్కుల్లో పడ్డ హీరో: పార్టీ పెట్టిన మూడో రోజుకే
కన్నడ హీరో ఉపేంద్ర రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అని వ్యాఖ్యానించి పార్టీ పెట్టిన మూడు రోజుల్లోనే లీగల్ కేసుల్లో ఇరుక్కున్నాడు.
సినిమా తారలంతా రాజకీయాల్లోకి రావటానికి తహ తహలాడుతున్నారు ఇప్పటికే తమిళ నాట రజినీకాంత్, కమల హాసన్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. కమల్ ఇప్పటికే సొంత పార్టీ అనే నిర్ణయం లో ఉండగా రజినీకాంత్ ఇంకా ఏ నిర్ణయమూ తేల్చనే లేదు.. ఇక మనదగ్గర పవన్ చురుకుగా పావులు కదుపుతూనే ఉన్నాడు.
కన్నడ హీరో ఉపేంద్ర
వీళ్ళంతా ఎవరి హడావిడిలో వాళ్ళుండగానే గప్ చిప్ గా తన పార్టీ ని ప్రకటించేసాడు కన్నడ హీరో ఉపేంద్ర. విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉన్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించాడు.
మొదటి రోజునే లీగల్ కేసు
అయితే ఆ సందర్భం లోనే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే క్రమం లో చిన్న పొరపాటు చేసేసారు. ఒక మాట జారటం తో పార్టీ పెట్టిన మూడు రోజుల్లోనే లీగల్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ముందు ముందు ఎదుర్కోబోయే సమస్యలని ముందే ఇప్పుడే చూపించింది ఈ ఘటన
కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ
రియల్ స్టార్ ఉపేంద్ర కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ప్రారంభించే సమయంలో అవినీతిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఇక్కడి శేషాద్రిపురం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పార్టీ ప్రారంభ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఉపేంద్ర సమాదానమిస్తూ...
డబ్బులిస్తే తీసుకోండి
ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్ గురువారం శేషాద్రిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.