Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మళ్లీ అంకెలతో సుకుమార్ టైటిల్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్ గతంలో లెక్కలు మాస్టారు గా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన చిత్రాల్లో కాస్త లాజిక్ పాలు ఎక్కువగానే ఉంటుంది. అలాగే జీవితపు లెక్కలు స్పృశిస్తూంటారు. ఆ మధ్యన నాగ చైతన్య తో చేసిన చిత్రానికి, ఈ మద్యన మహేష్ తో చేసిన చిత్రానికి సైతం 100 పర్శంట్ లవ్, 1 నేనొక్కిడినే అంటూ టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రానికి సైతం అంకె వచ్చేలా టైటిల్ ని ఖరారు చేసి తనకు ముద్రను మరోమారు గుర్తు చేసారు.
... నిర్మాతగా మారారన్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ చిత్రానికి 'కుమారి 21ఎఫ్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. రాజ్తరుణ్, షీనాబజాజ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ స్క్రీన్ప్లే సమకూరుస్తున్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ''ఇదొక సున్నితమైన ప్రేమకథ. అందరికీ నచ్చుతుంది. నిర్మాత కష్టాలు కూడా తెలుసుకొంటే బాగుంటుందని నేనూ నిర్మాణంలో పాలు పంచుకొంటున్నా. స్నేహానికి విలువనిచ్చే వ్యక్తులు దేవిశ్రీప్రసాద్, రత్నవేలు. ఈ సినిమాకి వాళ్లూ హీరోలే. 'ఉయ్యాలా జంపాలా'లో తన నటనతో తెరనంతా ఆక్రమించాడు రాజ్తరుణ్. తనకీ, నాకూ ఈ చిత్రం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతున్నా. సూర్యప్రతాప్ చెప్పిన కథతోనే నేను ఈ స్క్రిప్ట్ని తయారు చేశాను'' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సుకుమార్ ఒక మంచి స్క్రిప్ట్ నా చేతిలో పెట్టారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే తెరకెక్కిస్తా'' అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ''సుకుమార్ సినిమా అంటేనే నాకు ప్రత్యేకం. ఇప్పుడు తను నిర్మాతగా చేస్తున్న సినిమా కాబట్టి ఇంకా ప్రత్యేకం. ఈ కథ విచిత్రంగా, వైవిధ్యంగా ఉంటుంది''అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కార్తీక శ్రీనివాస్, పాటలు: చంద్రబోస్.