Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్లీ అంకెలతో సుకుమార్ టైటిల్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్ గతంలో లెక్కలు మాస్టారు గా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన చిత్రాల్లో కాస్త లాజిక్ పాలు ఎక్కువగానే ఉంటుంది. అలాగే జీవితపు లెక్కలు స్పృశిస్తూంటారు. ఆ మధ్యన నాగ చైతన్య తో చేసిన చిత్రానికి, ఈ మద్యన మహేష్ తో చేసిన చిత్రానికి సైతం 100 పర్శంట్ లవ్, 1 నేనొక్కిడినే అంటూ టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రానికి సైతం అంకె వచ్చేలా టైటిల్ ని ఖరారు చేసి తనకు ముద్రను మరోమారు గుర్తు చేసారు.
... నిర్మాతగా మారారన్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ చిత్రానికి 'కుమారి 21ఎఫ్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. రాజ్తరుణ్, షీనాబజాజ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ స్క్రీన్ప్లే సమకూరుస్తున్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ''ఇదొక సున్నితమైన ప్రేమకథ. అందరికీ నచ్చుతుంది. నిర్మాత కష్టాలు కూడా తెలుసుకొంటే బాగుంటుందని నేనూ నిర్మాణంలో పాలు పంచుకొంటున్నా. స్నేహానికి విలువనిచ్చే వ్యక్తులు దేవిశ్రీప్రసాద్, రత్నవేలు. ఈ సినిమాకి వాళ్లూ హీరోలే. 'ఉయ్యాలా జంపాలా'లో తన నటనతో తెరనంతా ఆక్రమించాడు రాజ్తరుణ్. తనకీ, నాకూ ఈ చిత్రం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతున్నా. సూర్యప్రతాప్ చెప్పిన కథతోనే నేను ఈ స్క్రిప్ట్ని తయారు చేశాను'' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సుకుమార్ ఒక మంచి స్క్రిప్ట్ నా చేతిలో పెట్టారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే తెరకెక్కిస్తా'' అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ''సుకుమార్ సినిమా అంటేనే నాకు ప్రత్యేకం. ఇప్పుడు తను నిర్మాతగా చేస్తున్న సినిమా కాబట్టి ఇంకా ప్రత్యేకం. ఈ కథ విచిత్రంగా, వైవిధ్యంగా ఉంటుంది''అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కార్తీక శ్రీనివాస్, పాటలు: చంద్రబోస్.