Don't Miss!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రంగస్థలం ఎఫెక్ట్.. సొంతూరులో సుకుమార్, భారీగా తరలి వచ్చిన జనం!
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ సునాయాసంగా సాధించిన టాలీవడ్ రికార్డులని తిరగరాసింది. బాహుబలి చిత్రం తరువాత అంతటి భారీ విజయంగా నిలిచింది. ఈ చిత్రంతో సుకుమార్ కు మంచి ప్రశంసలు దక్కాయి. దర్శకుడిగా ఆయన స్థాయి మరింతగా పెరిగింది.
ఇటీవల సుకుమార్ తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామం మట్టపర్రుకు వెళ్లారు. తన తండ్రి వార్షిక కార్యక్రమం నిమిత్తం ఆయన స్వగ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలందరితో సుకుమార్ ఆప్యాయంగా పలకరించారు. రంగస్థలం విజయం తరువాత సుకుమార్ ఖ్యాతి బాగా వ్యాపించింది. సుకుమార్ ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎగబడ్డారు.
రంగస్థలం విజయం సాధించినందుకు సుకుమార్ స్వగ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. సుకుమార్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అక్కడకు వచ్చిన మీడియాతో కూడా సుకుమార్ ముచ్చటించారు. తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని సుకుమార్ తెలిపారు.