Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ని టార్గెట్ చేసిన యాంకర్ సుమ.. ఏకంగా సవాల్ విసురుతూ! కేసీఆర్పై కామెంట్
యాంకర్ సుమ.. వ్యాఖ్యాతగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ సవాల్ విసరడం చర్చనీయాంశం అయింది. సుమ భర్త రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య మాంచి స్నేహబంధం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ, జూనియర్ ఎన్టీఆర్కి సవాల్ విసరడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా సవాల్? సుమ టార్గెట్గా ఎన్టీఆర్నే ఎందుకు ఎంచుకుంది? వివరాల్లోకి పోతే..
టీఆర్ఎస్ ఎంపీతో మొదలుకొని సుమ వరకు..
ప్రస్తుతం నెట్టింట 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్ని పలువురు సెలెబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తూ చివరకు యాంకర్ సుమ వద్దకు చేరింది.
బేగంపేటలోని మయూరి బిల్డింగ్
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఛాలెంజ్లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ, ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకున్నారు. ఇదే బాటలో తాజాగా యాంకర్ సుమ ఈ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటింది. హైదరాబాద్, బేగంపేటలోని మయూరి బిల్డింగ్ ప్రాంగణంలో మూడు మొక్కలు నాటింది.
జయసుధ నుంచి తీసుకొని ఎన్టీఆర్కి..
హరితహారంలో భాగంగా ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో మరో వ్యక్తి నుంచి ఈ ఛాలెంజ్ స్వీకరించిన జయసుధ మొక్కలు నాటి.. సుమ పేరును నామినేట్ చేసింది. దీంతో ఈ సవాల్ను స్వీకరించిన సుమ, ఓ మూడు మొక్కలు నాటి జూనియర్ ఎన్టీఆర్కి తన సవాల్ విసిరింది.
|
బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ రాహుల్ని కూడా వదల్లేదు
జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మంచు లక్ష్మి, బిగ్ బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్కు కూడా సుమ ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సుమ.. ‘నిండుదనంతో పచ్చదనం' ప్రాజెక్టులో భాగంగా తనకు ఛాలెంజ్ విసిరిన సినీ నటి జయసుధకు తన ధన్యవాదాలు చెప్పింది. ‘మెుక్కలను నాటుదాం.. ప్రకృతిని అందంగా ఉంచుదాం.. మనం ఆనందంగా ఉందాం' అని సుమ పేర్కొంది.
Recommended Video
కేసీఆర్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు అంటూ
ఇక ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఎంపీ సంతోష్ కుమార్కి, ‘హరితహారం'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపింది సుమ. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలాగే కొనసాగాలని, ఇందులో ప్రతీ ఒక్కరూ భాగమై పర్యావరణ పరిరక్షణ పాటు పడాలని చెప్పింది.