Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అఫీషియల్ : 'లేడీస్ టైలర్' సీక్వెల్ కు హీరో దొరికాడు
హైదరాబాద్: సీనియర్ డైరెక్టర్ వంశీ తాను హిట్ కొట్టిన లేడీస్ టైలర్కి సీక్వెల్ తీయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మొదట్లో రవితేజ, ఆ తర్వాత రాజ్తరుణ్ హీరోగా ఈ ఫిల్మ్ రావచ్చునంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ గాసిప్స్గానే మిగిలిపోయాయి. చివరకు చాలామంది హీరోల పేర్లు వచ్చినా, ఫలితం లేకపోయింది. అయితే ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లటానికి రంగం సిద్దమైందని సమాచారం.
అయితే ఈ సీక్వెల్ లో ఇప్పుడు సీన్ లోకి వచ్చిన హీరో ఎవరనుకుంటున్నారా.. హీరో సుమంత్ అశ్విన్. ఈ సీక్వెల్ కు 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' అనే టైటిల్ ను నిర్ణయించారు. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించున్నాడు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుంది. ఇక ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.
Sumanth Ashwin is FASHION DESIGNER s/o LADIES TAILOR.
— Madhura Sreedhar (@madhurasreedhar) October 6, 2016
ఒరిజినల్లో లేడీస్ టైలర్గా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలోనూ ఆ పాత్రను పోషిస్తారు. అంటే రాజేంద్రప్రసాద్, సుమంత్ అశ్విన్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారన్న మాట. ముగ్గురు హీరోయిన్లు నటించే ఈ ఆసక్తికర చిత్రాన్ని మధుర ఎంటర్టైనమెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్రెడ్డి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన పనులు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఇక దర్శకుడు వంశీ కెరీర్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం, హీరోగా రాజేంద్రప్రసాద్ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం 'లేడీస్ టైలర్'. 1985 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని దర్శకుడు వంశీ ఎన్నాళ్లగానో అనుకుంటున్నాడు. కానీ హీరో విషయంలోనే సరైన నిర్ణయానికి రాక ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చి చివరకు ఇప్పుడు మొదలుకానుంది.