Don't Miss!
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- News ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఆ హీరోయిన్లను అలా చేశాననేది అబద్దం: సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 9 సంవత్సరాలైంది. తొలుత చిన్న పాత్రలు చేసినా తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు. పలు చిత్రాల్లో హీరోగా చేశాడు. అందులో అతడికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్'. ఈ చిత్రంలో సందీప్తో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయింది. సందీప్తో ఇతర సినిమాలు చేసిన రెజీనా, రాశీఖన్నా కూడా ఓ స్థాయి వెళ్లారు. దీంతో సందీప్తో చేసిన ఓ హీరోయిన్లు ఓ రేంజికి వెళతారనే ఓ సెంటిమెంట్ ఉంది.
వారు కష్టపడితే వచ్చిందే
ఇటీవల ఆలీ నిర్వహించే ఓ షోలో సందీప్ కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ అతడిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. సందీప్ కిషన్ పక్కన ఏ కొత్త అమ్మాయి చేసినా, ఆ అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక టాక్. ఎంతవరకూ నిజం? అని అలీ ప్రశ్నింగా... ‘అది వాళ్లు కష్టపడితే వచ్చిందే, నా వల్ల ఏమీ కాదు' అని సమాధానం ఇచ్చారు.
Recommended Video
అడ్వాంటేజ్ తీసుకోలేదు
అడ్వాంటేజ్గా తీసుకుని రెజీనా, రకుల్, రాశీఖన్నా, సురభిలను ఆడుకున్నావని కంప్లైంట్ చేశారు? దీనికి నువ్వేమంటావ్ అని అలీ ప్రశ్నించగా....అలాంటిది ఏమీ లేదు. వాళ్లంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను వారితో ఆడుకుని, ఏడిపించి ఉంటే వారు నాతో ఫ్రెండ్షిప్ కొనసాగించే వారు కాదు అని సందీప్ కిషన్ అన్నారు.
రకుల్ గురించి
రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడుతూ చాలా కష్టపడుతుంది. ఆ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. మనం ఐదుగంటలకు సెట్కు రమ్మంటే నాలుగున్నరకే వస్తుంది... అని సందీప్ కిషన్ తెలిపారు.
రెజీనా నేను కొట్టుకుంటాం, తిట్టుకుంటాం
రెజీనా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్... ఎంత క్లోజ్ అంటే మేమిద్దరం కొట్టుకుంటాం, అప్పుడప్పుడూ తిట్టుకుంటాం.... అని సందీప్ కిషన్ తెలిపారు.
అపుడు రాశి ఖన్నాతో పడేది కాదు
‘జోరు' షూటింగ్ సమయంలో రాశి ఖన్నాతో పడేది కాదు. అయితే తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. హీరోయిన్ సురభి నాకు క్లోజ్ కాదు, దూరం కాదు జస్ట్ ఫ్రెండ్ అని సందీప్ కిషన్ తెలిపారు.
రకుల్తో ఎఫైర్ గురించి
రకుల్తో ఎఫైర్ ఉందనే వార్తలను ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఖండించారు. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అన్నారు. నేనూ, రెజీనా కలిసి తమిళంలో నాలుగు సినిమాలు చేసినందుకు నాకూ-రెజీనాకు అఫైర్ ఉందని కూడా రాశారు అని సందీప్ తెలిపారు.