Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అదిరిపోయే అనౌన్స్మెంట్ చేసిన సందీప్ కిషన్.. నిజంగా శుభవార్తే
వరుస పరాజయాలతో సతమతమవుతున్న వేళ 'నిను వీడని నీడను నేనే'తో హిట్ ట్రాక్ ఎక్కాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. అన్యా సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను కార్తీక్ రాజు తెరకెక్కించాడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వీ స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.
సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిలర్గా తెరకెక్కిన ఈ సినిమా రెండో రోజూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో సందీప్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. ఇప్పటికే తన సినిమాను సక్సెస్ చేసిన ఫ్యాన్స్ అందరితో పాటు సినీ ప్రియులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే, సినిమా బాగుందంటూ తన తండ్రి చేసిన మెసేజ్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను సైతం ఇటీవల షేర్ చేశాడు.
తాజాగా ఈ యంగ్ హీరో సోషల్ మీడియా వేదికగా మరో బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు. తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'నిను వీడని నీడను నేనే'ను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. ఈ రీమేక్ హక్కులను 'స్త్రీ', 'షోర్' ఫేమ్ నిర్మాత, దర్శకుడు తీసుకున్నారని సందీప్ వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. ''ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సినిమా రీమేక్ హక్కులను నా మార్గదర్శకులు, నా సోదరులు రాజ్, డీజే తీసుకున్నారు. నా సినిమా మంచి వారైన నా సోదరుల చేతిలోకి వెళ్లినందుకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడికి నమస్కారాలు'' అంటూ ట్వీట్ చేశాడు.
వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సందీప్ కిషన్.. ప్రమోషన్ కూడా వినూత్నంగా ప్లాన్ చేశాడు. 'నిను వీడని నీడను నేనే' ప్రీ రిలీజ్ ఈవెంట్కు యువ హీరోలు నిఖిల్, సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ, 'ఫలక్నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. వీళ్లకు సినిమా సెకండ్ టికెట్ను సందీప్ కిషన్ అందజేశారు. అలాగే మొదటి టికెట్ను హీరో ప్రభాస్ కొనుగోలు చేయడం విశేషం.