Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సందీప్ కిషన్ సరికొత్త ప్లాన్.. ఆ వ్యాపారం లోకి ఎంటర్
రోజురోజుకూ యువ హీరోల తీరు మారుతూ వస్తోంది. కేవలం సినిమాలే గాక సొంతంగా వ్యాపారం చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు యంగ్ హీరోస్. ఈ మేరకు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ఇప్పటికే వ్యాపార రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు కూడా. తాజాగా వారి బాటలోనే సందీప్ కిషన్ వెళ్తున్నాడు.
సరికొత్తగా ఆలోచిస్తూ వ్యాపార విస్తరణ దిశగా అడుగులేస్తున్నాడు సందీప్ కిషన్. ఈ ఏడాది హీరోగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నాడు సందీప్ కిషన్. 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ఆయన నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ'తో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
హీరోగా, నిర్మాతగానే కాక సందీప్ కిషన్ వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నాడు. ఇప్పటికే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో 'వివాహ భోజనంబు' పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న సందీప్.. కొత్తగా మరో వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాడు.
స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఈ సెలూన్ ఫ్రాంచైజీని ప్రారంభించనున్నాడు. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ సందీప్ వేస్తున్న అడుగులు చూసి వావ్ అనేస్తున్నారు ఆయన అభిమానులు. సందీప్ కిషన్ ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ప్రెస్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాకీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.