Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
అభిమాని మృతి: కుటుంబ సభ్యులకు సందీప్ కిషన్ పరామర్శ
ఇటీవల తనను అమితంగా ఇష్టపడే అభిమాని మరణించడం యువ కథానాయకుడు సందీప్కిషన్కు విషాదాన్ని మిగిల్చింది. తన తొలి చిత్రం ప్రస్థానం నుంచి అభిమానిగా మారిన కడప శ్రీను శుక్రవారం జనవరి 18న ప్రొద్దుటూరులో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమాని మృతి కలత చెందిన సందీప్ కిషన్ ఇటీవల మృతుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. కడప శ్రీను కుటుంబానికి ప్రతీ నెల రూ.7వేలను ఇస్తానని ప్రకటించారు కూడా.
తీరని శోకంలో మునిగిన కడప శ్రీను కుటుంబాన్ని ఇటీవల కలిసి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక అండతోపాటు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని మాట ఇచ్చినట్టు తెలిసిందే.
తన అభిమాని మరణంతో ఇబ్బందుల్లో పడిన కుటుంబాన్ని ఆదుకోవడానికి సందీప్ కిషన్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అభిమానులను పట్టించుకోని హీరోలు ఉన్న ఈ రోజుల్లో సందీప్ కిషన్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.