Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వామ్మో సందీప్ కిషన్ మాములోడు కాదు.. ఆ విషయంలో మంచి ప్లానే వేశాడు..
తెలుగు యువ హీరోల్లో ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరో సందీప్ కిషన్.. కొంత కాలం పాటు సరైన హిట్ లేక వెనకబడ్డాడు. అయితే జానర్ మార్చి సినిమాలు చేసినా.. లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీసెంట్గా వచ్చిన నిను వీడని నీడను నేను అనే చిత్రం వరుస అపజయాల నుంచి కాస్త ఊరటనిచ్చింది.
అయితే సందీప్ కిషన్.. తాజాగా చేసిన ట్వీట్ వైలర్ అవుతోంది. ఈ హీరో నగరం అనే ఓ సినిమాను చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజ్.. తాజాగా ఓ జాక్ పాట్ కొట్టేశాడు. ఇళయ దళపతి విజయ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. తమిళ సంచలనం అయిన విజయ్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడైనా కోరుకుంటారు. ఇక తన స్నేహితుడైన లోకేష్ ఇంతటి లక్కీ చాన్స్ వచ్చినందుకు ఈ హీరో చాలా సంబరపడుతున్నాడు.
అయితే దాంట్లోనూ ఈ హీరోకు చిన్న ఆశ కూడా దాగి ఉంది. అదేటంటే.. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్లి విజయ్ ను చూద్దామని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. నాకెంతో గర్వంగా ఉంది మచ్చా.. నేనిక ఎదురుచూడలేకపోతున్నా.. నిన్ను చూడటానికి సెట్స్ కు వస్తా అలాగే విజయ్ సార్ ను కలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు.. స్క్రీన్ పై నువ్వు చేయబోయే మ్యాజిక్ గురించి ఎదురుచూస్తున్నా.. అంటూ ట్వీట్ చేశాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం తెనాలి రామక్రిష్ణ బీఏ బీఎల్ చిత్రాన్ని చేస్తున్నాడు.