Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భీమవరం బార్లో ఇలాగే ఉండేవాడిని.. సునీల్ దర్శత్వంలో మెగా హీరో సినిమా!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. బుధవారం ఉందయం ఈ చిత్ర టీజర్ని విడుదల చేశారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రం యూనిట్ మొత్తం పాల్గొంది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సునీల్ మాట్లాడుతూ చిత్రలహరి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
భీమవరం బార్లో
మా భీమవరం బార్లో, వైన్ షాప్స్ ముందు స్నేహితులతో ఎలా ఉండేవాడినో చిత్రలహరి చిత్రంలో నా పాత్ర అలా ఉంటుందని సునీల్ తెలిపాడు. మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రంలో నటించే అవకావం వచ్చిందని సునీల్ తెలిపాడు. హీరో, హీరోయిన్ల తర్వాత ఈ చిత్రంలో అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్ర సునీల్దే. టీజర్లో హీరో, హీరోయిన్ల పాత్రలో పాటు సునీల్ పాత్రని కూడా పరిచయం చేశారు.
చాలా వెటకారం ఉంది
దర్శకుడు కిషోర్ తిరుమల గురించి మాట్లాడుతూ.. ఆయనలో చాలా వెటకారం దాగుందని తెలిపాడు. కానీ బయటకు అలా కనిపించరు. ఇక నుంచి వెటకారాన్ని బయట పెట్టమని ఆయనతో చెప్పినట్లు సునీల్ తెలిపాడు. నా పాత్రకు మీరే ఫస్ట్ ఆడియన్స్ అని మీడియాని ఉద్దేశించి చెప్పారు. టీజర్లో నేను చెప్పిన డైలాగ్ కు ఎలాంటి స్పందన ఆశించానో.. అంతకు మించిన రెస్పాన్స్ మీలో నాకు కనిపించింది.
దర్శకుడిగా మారుతా
చిత్రలహరి ద్వారా సాయిధరమ్ తేజ్కు మంచి విజయం దక్కబోతోంది అని సునీల్ తెలిపాడు. ప్రతి ఒక్కరు వేసవిలో ఎంజాయ్ చేసే ఫన్ తో పాటు, మంచి ఫీలింగ్ ఉన్న ప్రేమ కథా చిత్రం ఇది అని సునీల్ తెలిపాడు. దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని చాలా కొత్తగా రూపొందించారు. కొత్త కథలని ప్రోత్సహించడంలో మైత్రి మూవీస్ సంస్థ ముందుంటుంది అని ప్రశంసించారు. సాయిధరమ్ తేజ్ కోసం దర్శకుడిగా మారి ఓ చిత్రం చేస్తానని సునీల్ సరదాగా వ్యాఖ్యానించాడు. తేజు అంటే నాకు అంత ఇష్టం అని సునీల్ తెలిపాడు.
ప్రతి శుక్రవారం ట్యూషన్కి
సినిమాలు చూడడానికి ఎప్పుడూ బడికి డుమ్మా కొట్టేవాడిని. మా స్కూల్ మాస్టారుకి ఎప్పుడూ కనిపించేవాడిని కాదు. కానీ శుక్రవారం మాత్రం ట్యూషన్లో ప్రత్యక్షమైపోయేవాడిని. ఆ రోజు చిత్రలహరి వస్తుంది. మా ఇంట్లో టివి ఉండేది కాదు. మా మాస్టారు ఇంట్లో ఉండేది. అందుకే ట్యూషన్ కు శుక్రవారం మాత్రం వెళ్ళేవాడిని అని సునీల్ తెలిపాడు. చిత్రలహరిలో చిరంజీవి పాటలు చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడిని అని సునీల్ తెలిపాడు.