సునీల్ తోనే 'తను వెడ్స్ మనూ'రీమేక్ ..దర్శకుడు ఎవరంటే
'తను వెడ్స్ మనూ' తెలుగులో సునీల్ తో రీమేక్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి దర్శకుడుగా బ్లేడు బాబ్జీ దర్సకుడు దేవి ప్రసాద్ ని ఎంపికచేసినట్లు విశ్వసనీయ సమాచారం.మెగా సూపర్ గుడ్ పతాకంపై ఈ చిత్రం నిర్మించనున్నారు. మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఈ హిందీ చిత్రం తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
అందులోనూ దేవి ప్రసాద్ గతంలో సునీల్ తో ఆడుతూ పాడుతూ చిత్రం చేసి ఉన్నారు.పూర్తి కామిడీతో రూపొందిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది.ఆ తర్వాత లీలా మహల్ సెంటర్,పాండు చిత్రాలు రూపొందించారు.ఇక సునీల్ ఇప్పుడు కోటి అనే నూతన దర్శకుడుతో నెపోలియన్ అనే చిత్రం కమిటయ్యారు.దిల్ రాజు ఆ చిత్రం నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











