Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అంధులతో సునీల్ బర్త్ డే: 2 లక్షల విరాళం
హైదరాబాద్: కమెడియన్ గా సినీ రంగ ప్రవేశం చేసి, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఈ రోజు(ఫిబ్రవరి 28) తన పుట్టిన రోజు వేడుకలను దేవనార్ బ్లైండ్ స్కూల్ లో జరుపుకున్నారు. అదే విధంగా అంధ విద్యార్థుల సహాయార్థం రూ. 2 లక్షలను విరాళంగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సునీల్, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకురాలు బి జయ, రాజా రవీందర్, దేవనార్ చైర్మన్ స్వామిగౌడ్, దేవానార్ డైరెక్టర్ శ్రీమతి జ్యోతి పాల్గొన్నారు. సునీల్ తమతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం, తమ కోసం ఆర్థిక సహాయం చేయడంపై అంధ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ...'శంభో శివ శంభో సినిమా షూటింగ్ అప్పుడు ఇక్కడకు వచ్చాను. మళ్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలాంతా నన్ను గుర్తు పెట్టుకుని అన్నా నువ్వు శంభో శివ శంభో అప్పుడు వచ్చావు కదా అని పలకరించడం చాలా గొప్పగా అనుభూతిని కలిగించింది. నేను ఇచ్చింది తక్కువే అయినా, నాలా మరికొంత మంది ముందుకు వస్తారనే ఆశతో ఈ సాయం చేస్తున్నాను' అన్నారు.
ఇక పోతే సునీల్ నటిస్తున్న 'మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా రేపు(మార్చి 1) విడుదల కాబోతోంది. సునీల్, ఇషాచావ్లా జంటగా మెగా సూపర్గుడ్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్నారు. సి.దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు.